Andhra News: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటిని పట్టేశారు
జిల్లాలో గత కొన్ని రోజులుగా భయాందోళనకు గురి చేస్తున్న ఎలుగుబంటిని ఎట్టకేలకు అధికారులు పట్టుకున్నారు. గన్ సాయంతో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చిక్కేలా చేశారు.
వజ్రపుకొత్తూరు: శ్రీకాకుళం జిల్లాలో గత కొన్ని రోజులుగా భయాందోళనకు గురి చేస్తున్న ఎలుగుబంటిని ఎట్టకేలకు అధికారులు పట్టుకున్నారు. గన్ సాయంతో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చిక్కేలా చేశారు. వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగిలోని పశువుల పాకలో పట్టుకున్నారు. అనంతరం బోనులో బంధించి విశాఖ జూకు తరలించారు. ఆదివారం కిడిసింగి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడిపై ఎలుగు దాడి చేయడంతో అతను ప్రాణాలు విడిచాడు.
నిన్న వజ్రపుకొత్తూరు సంతోషిమాత ఆలయంలోని జీడితోటలో పశువుల కోసం రేకుల షెడ్డు వేస్తుండగా ఎలుగుబంటి ఏడుగురిపై దాడి చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరు మృతిచెందగా.. ఆరుగురు శ్రీకాకుళంలోని మెడికేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారానికి పైగా హడలెత్తించిన ఎలుగును పట్టుకోవడం ఉపశమనం కలిగించిందని గ్రామస్థులు చెబుతున్నారు. మరో రెండు ఎలుగుబంటి పిల్లలు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయని.. వాటిని కూడా పట్టుకోవాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్