Viral News: ‘అమ్మకానికి కిడ్నీ’ అంటూ పోస్టర్.. ఇది కదా అసలు ట్విస్ట్!
బెంగళూరులో అద్దె ఇంటిని వెతికేందుకు ఓ వ్యక్తి స్థానికంగా అతికించిన ఓ పోస్టర్ వైరల్గా మారింది. కారణం.. అందులో అద్దె డిపాజిట్ చెల్లించేందుకు కిడ్నీ విక్రయానికి ఉందని పొందుపరచడమే!
బెంగళూరు: మహా నగరాల్లో సరైన ఇల్లు అద్దె(Rent House)కు దొరకడం చాలా కష్టం. ఒకవేళ లభించినా.. దాని నెలవారీ కిరాయి, సెక్యూరిటీ డిపాజిట్(Security Deposit)ల వివరాలు ఆరా తీస్తే కళ్లు తిరగాల్సిందే..! ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru)లో అద్దె ఇంటి అన్వేషణకు విచిత్ర మార్గాన్ని ఎంచుకున్నాడో వ్యక్తి. అద్దె ఇంటి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లింపు కోసం ఏకంగా తన కిడ్నీ అమ్మకానికి ఉందంటూ(Kidney For Sale) స్థానికంగా ఓ పోస్టర్ అతికించాడు. ఇదికాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
‘ఎడమ కిడ్నీ విక్రయానికి ఉంది. ఇంటి యజమానులు అడుగుతున్న సెక్యూరిటీ డిపాజిట్ కోసం పెద్దఎత్తున డబ్బు అవసరం. అందుకే ఈ ప్రయత్నం’ అని ఆ పోస్టర్లో పెద్ద అక్షరాల్లో కనిపిస్తోంది. అయితే, ఇది చదివి ఆశ్చర్యపోయే వారు.. ఇంకాస్త కిందకు వెళ్లి చూస్తే అసలు విషయం తెలుస్తుంది. ‘కిడ్నీ విక్రయం సరదాకే అంటున్నా. కానీ, నాకు ఇందిరానగర్లో ఓ ఇల్లు అవసరం’ అని చిన్న అక్షరాల్లో రాసి ఉంది. తనకు సంబంధించిన వివరాల కోసం స్కాన్ చేయాలంటూ ఓ క్యూఆర్ కోడ్నూ పోస్టర్పై ముద్రించడం గమనార్హం.
సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్ట్ కాస్త.. మహా నగరాల్లో పెరిగిపోతున్న ఇంటి అద్దెలపై చర్చకు దారితీసింది. మెట్రో సిటీల్లో ఈ అద్దె కష్టాలు వాస్తవమేనంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. అందరూ ఓకే ప్రాంతంలో ఇల్లు కోరుకుంటుండటంతో సమస్య తలెత్తుతోందంటూ ఓ నెటిజన్ స్పందించాడు. ఎవరో ఐఫోన్ కొనేందుకు యత్నిస్తున్నారంటూ ఒకరు సరదాగా వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 30 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్