Bengaluru: బెంగళూరుకు గులాబీ శోభ.. నగరంలో కొత్త అందాల ఫొటోలు చూశారా?
బెంగళూరు నగర రహదారులు సరికొత్త ప్రకృతి అందాలతో గులాబీమయంగా మారాయి. ప్రతి ఏటా మార్చి లేదా ఏప్రిల్ నెలలో వికసించే పింక్ ట్రంపెట్స్ పూలు, ఈసారి కాస్త ముందుగానే వికసించడంతో రోడ్లు గులాబీ తోటలను తలపిస్తున్నాయి.
బెంగళూరు: భారత ఐటీ రాజధాని అనగానే ముందుగా గుర్తొచ్చేది బెంగళూరు నగరమే. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే ఇక్కడి వాతావరణం కాస్త చల్లగా ఉంటుంది. నగరంలోని లాల్బాగ్ గార్డెన్స్ ప్రత్యేక పర్యాటక ఆకర్షణ. ఏటా ఇక్కడ జరిగే ఫ్లవర్ ఫెస్టివల్కు భారీ సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. ప్రస్తుతం బెంగళూరులో మరో ప్రకృతి శోభ గత కొన్ని రోజులుగా నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అవే పింక్ ట్రంపెట్స్ పూలు. బెంగళూరు సెంట్రల్, బసవగుండి, రింగ్ రోడ్, ఇందిర నగర్, మల్లేశ్వరం, చామరాజ్పేట, సంజయ్ నగర్ వంటి ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా ఈ పూల చెట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పూలు వికసిస్తుండటంతో ఆ దారిలో వెళ్లే ప్రయాణికులు గులాబీ తోటలోంచి ప్రయాణిస్తున్న అనుభూతిని పొందుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.
ఈ ఫొటోలను కర్ణాటక పర్యాటక శాఖ ఇటీవల తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ‘‘బెంగళూరులో పింక్ ట్రంపెట్స్గా పిలిచే పూలు వికసించడం ప్రారంభించాయి. దీంతో బెంగళూరులోని కొన్ని దారులు గులాబీ రంగులోకి మారాయి’’ అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. సాధారణంగా ఏటా ఇవి మార్చి లేదా ఏప్రిల్ నెలలో వికసిస్తాయి. కానీ, ఈసారి కాస్త ముందుగానే నగరానికి గులాబీ శోభను తెచ్చాయని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఈ ప్రకృతి అందాలను మనం జాగ్రత్తగా కాపాడితే, మన తర్వాతి తరాలకు కూడా ఈ ప్రకృతి రమణీయతను అందించవచ్చని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు