భద్రాద్రిని టెంపుల్ సిటీ చేయాలి: పువ్వాడ
భద్రాద్రిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కోరారు
భద్రాచలం: భద్రాద్రిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కోరారు. భద్రాచలంలో ఎక్సైజ్ పోలీస్స్టేషన్ను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భద్రాద్రిని అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ను పువ్వాడ కోరారు. అనంతరం శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. సీఎం ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రాభివృద్ధి జరుగుతోందన్నారు.కుట్ర పూరితంగా 7 మండలాలను ఏపీలో కలిపారని ఆరోపించారు. ఆలయానికి చెందిన 1,800 ఎకరాల భూమిని ఏపీలో కలిపారని విమర్శించారు. కనీసం ఆరు గ్రామాలను మళ్లీ భద్రాచలంలో కలపాలని శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. దీని కోసం కేంద్రం చొరవ తీసుకోవాలన్నారు. యాదాద్రి తర్వాత భద్రాద్రిపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతామని, రూ.100 కోట్లతో భద్రాద్రి అభివృద్ధి చేసే ఆలోచనలో సీఎం ఉన్నారని వెల్లడించారు. అనంతరం జీసీసీలో సబ్బులు, షాంపూ తయారీ యూనిట్ను మంత్రులు పువ్వాడ, సత్యవతి, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
ఇవీ చదవండి..
వైకాపా పాలనలో వలసలు పెరిగాయి: తెదేపా
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి:ఎస్ఈసీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్