తెలుగు రాష్ట్రాల్లో ‘భోగి’ సందడి
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. విద్య, వృత్తి నిమిత్తం సుదూర ప్రాంతాలకు వెళ్లిన వారంతా పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు చేరుకున్నారు. దీంతో గ్రామాల్లో సందడి ..
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. విద్య, వృత్తి నిమిత్తం సుదూర ప్రాంతాలకు వెళ్లిన వారంతా పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు చేరుకున్నారు. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. తెలుగు వారి పెద్ద పండుగలో మొదటిదైన భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే చిన్నా పెద్ద అంతా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. గంగిరెద్దులు, హరిదాసులు, మేలాల నడుమ రంగవళ్లులపై గొబ్బెమ్మలు ఉంచి బోగి మంటలు వేశారు. వాటి చుట్టూ ప్రదక్షిణలు చేసి సందడి చేశారు.
తిరుమలలో భోగి వేడుకలు
సంక్రమణ మహాపర్వానికి ముందురోజు చేసుకునే భోగి పండుగను ఆధ్యాత్మిక నగరి తిరుమలలో ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. శ్రీవారి ఆలయం మహాద్వారం ముందు వేకువజామున భోగి మంటలు వేశారు. శ్రీవారి సేవకులు, భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ధనుర్మాస కైంకర్యాలు, నిత్య కైంకర్యాలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు.
ఇంద్రకీలాద్రిపై..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సంక్రాంతి పండుగ సంబరాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాదశర్మ, వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు దంపతులు మంత్రోచ్ఛరణల మధ్య భోగి మంటలను ప్రజ్వలింపజేశారు. అనంతరం భోగి చుట్టూ పదక్షిణలు చేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. మహామండపం పెద్ద రాజగోపురం ఎదురుగా బొమ్మలకొలువు ఏర్పాటు చేశారు. భోగి సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు భోగి మంటలు, బొమ్మలకొలువును చూసి ఆనందించారు. సాయంత్రం బొమ్మలకొలువు వద్ద ఏర్పాటు చేసిన ఉత్సవ మూర్తుల వద్ద చిన్నపిల్లలకు భోగి పళ్లు పోస్తామని ఈవో సురేశ్ బాబు తెలిపారు.
తీపి గురుతులతో ఆహ్వానం పలుకుదాం..
కరోనా చేదు జ్ఞాపకాలను భోగిమంటల్లో వేసి.. తీపి గురుతులతో సంక్రాంతికి ఆహ్వానం పలుకుదామని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రజలకు పిలుపునిచ్చారు. కుటుంబసభ్యులతో కలిసి విజయవాడలో భోగి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరి జీవితంపై ప్రభావం చూపిన కరోనాతో పాటు, మనిషిలోని చెడును తగలబెట్టి మనచుట్టూ మంచిని విస్మరించడమే ఈ భోగి మంటల అంతరార్థంగా మంత్రి పేర్కొన్నారు. పాడిపంటలు చేతికొచ్చే సమయంలో చేసుకునే సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.
అమరావతిలో భోగి వేడుకలు
రాజధాని గ్రామాల్లో రైతులు బోగి వేడుకలను నిర్వహించారు. ‘‘నేటి భోగి మంటలు కారాదు రేపటి అమరావతి చితిమంటలు’’ పేరుతో భోగి మంటల కార్యక్రమం చేపట్టారు. తుళ్లూరులో నిర్వహించిన భోగి వేడుకల్లో గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నియోజవకర్గ బాధ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నేతలు పాల్గొన్నారు. అమరావతికి వ్యతిరేకంగా రూపొందించిన చట్టాల ప్రతులను భోగిమంటల్లో వేశారు. భోగి మంటల చుట్టు మహిళలు జానపదాలు పాడుతూ నిరసన తెలిపారు. వెలగపూడిలో హరిదాసులతో కలిసి రైతులు భోగి మంటలు వేశారు. వెంకటపాలెం, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, కృష్ణాయపాలెంలో రైతులు భోగి వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
తెలంగాణలో..
సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే లా ప్రారంభమయ్యాయి. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన భోగి సంబరాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. తొలుత భాగ్యలక్ష్మీ ఆమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించిన కవిత... అనంతరం చార్మినార్ ఎదుట ఏర్పాటు చేసిన భోగి వేడుకలను ప్రారంభించారు. గడచిన ఏడాది కాలం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, భవిష్యత్తు బావుండాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపిన కవిత.... అందరూ పండుగను వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
♦ హైదరాబాద్ కూకట్పల్లిలోని మలేషియా టౌన్షిప్లో ఉదయాన్నే భోగిమంటలు, గంగిరెద్దుల ఆటలతో సంక్రాంతి వైభవాన్ని చాటి చెప్పేలా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా వేడుకలను జరిపారు.
ఇవీ చదవండి..
భోగి, సంక్రాంతి, కనుమ ప్రాముఖ్యత ఏమిటి?
అదే నా తప్పయితే క్షమించండి: చంద్రబాబు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..