Ap News: సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

భోగి పండుగ సకల జనులకు ఆ భగవంతుడు భోగభాగ్యాలు, సుఖసంతోషాలు కలిగించాలని ఉపరాష్ట్రపతి

Updated : 14 Jan 2022 09:17 IST

చెన్నై: భోగి పండుగ సకల జనులకు ఆ భగవంతుడు భోగభాగ్యాలు, సుఖసంతోషాలు కలిగించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. భోగి పండుగ సందర్భంగా చెన్నై కోట్టూర్ పురంలోని స్వగృహం వద్ద వెంకయ్యనాయుడు దంపతులు భోగిమంటలు వేశారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. అందరి జీవితాలు ఆరోగ్యం, శ్రేయస్సుతో ఆనందమయం కావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని