Andhra News: పేలిన బైక్‌ పెట్రోల్‌ ట్యాంక్.. విస్ఫోటనంలా మంటలు.. వీడియో

అనంతపురం జిల్లా కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఇటీవల బుల్లెట్ బైక్‌లో మంటలు చెలరేగి.. పెద్ద శబ్దంతో పెట్రోల్‌ ట్యాంక్ పేలింది.

Published : 04 Apr 2022 14:11 IST

అనంతపురం: అనంతపురం జిల్లా కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఇటీవల బుల్లెట్ బైక్‌లో మంటలు చెలరేగి.. పెద్ద శబ్దంతో పెట్రోల్‌ ట్యాంక్ పేలింది. దీంతో అక్కడున్న భక్తులు ఆందోళనకు గురయ్యారు. మైసూరుకు చెందిన రవిచంద్ర.. స్వామిని దర్శించుకునేందుకు బైక్‌పై వచ్చారు. ఆలయం సమీపంలో నిలిపి ఉంచిన బైక్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పూర్తిగా కాలిపోయిన బుల్లెట్ బైక్ ట్యాంక్ పెద్ద శబ్దంతో పేలింది. విస్ఫోటనం చెందే రీతిలో భారీగా మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు నీళ్లు చల్లి మంటలను ఆర్పివేయడంతో పక్కనున్న బైకులకు మంటలు వ్యాపించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని