Telangana News: ఆత్మహత్యకు యత్నించిన భాజపా కార్యకర్త మృతి.. ఖమ్మంలో ఉద్రిక్తత
ఖమ్మంలో ఆత్మహత్యకు యత్నించిన భాజపా కార్యకర్త మృతిచెందాడు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయిగణేశ్ మరణించాడు.
హైదరాబాద్: ఖమ్మంలో ఆత్మహత్యకు యత్నించిన భాజపా కార్యకర్త మృతిచెందాడు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయిగణేశ్ మరణించాడు. భాజపా మజ్దూర్ యూనియన్ సెల్ జిల్లా కన్వీనర్గా పని చేస్తున్న సాయి గణేశ్ ఈ నెల 14న ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు కేసుల పేరుతో వేధిస్తున్నారంటూ పురుగుల మందు తాగాడు. ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతిచెందాడు.
అప్రమత్తమైన పోలీసులు..
భాజపా కార్యకర్త మృతితో ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వద్ద భాజపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. అప్రమత్తమైన పోలీసులు మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయం, తెరాస కార్యాలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు