Telangana News: ఆత్మహత్యకు యత్నించిన భాజపా కార్యకర్త మృతి.. ఖమ్మంలో ఉద్రిక్తత

ఖమ్మంలో ఆత్మహత్యకు యత్నించిన భాజపా కార్యకర్త మృతిచెందాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయిగణేశ్‌ మరణించాడు.

Updated : 27 Dec 2022 18:52 IST

హైదరాబాద్‌: ఖమ్మంలో ఆత్మహత్యకు యత్నించిన భాజపా కార్యకర్త మృతిచెందాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయిగణేశ్‌ మరణించాడు. భాజపా మజ్దూర్‌ యూనియన్‌ సెల్‌ జిల్లా కన్వీనర్‌గా పని చేస్తున్న సాయి గణేశ్‌ ఈ నెల 14న ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు కేసుల పేరుతో వేధిస్తున్నారంటూ పురుగుల మందు తాగాడు. ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతిచెందాడు.

అప్రమత్తమైన పోలీసులు..
భాజపా కార్యకర్త మృతితో ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వద్ద భాజపా శ్రేణులు ఆందోళనకు దిగాయి.  అప్రమత్తమైన పోలీసులు మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయం, తెరాస కార్యాలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని