Black Dahlia: బ్లాక్ డహ్లియా.. ఓ అంతు చిక్కని హత్య!
ప్రపంచంలో ఎన్నో చిక్కువీడని హత్య కేసులు ఉన్నాయి. వాటిలో దశబ్దాల కిందట అమెరికాలో సంచలనం సృష్టించిన బ్లాక్ డహ్లియా హత్య కేసు ఒకటి. ఆమె ఏమీ పెద్ద సెలబ్రిటీ కాదు, రాజకీయ నాయకురాలూ కాదు. కానీ.. ఆమె హత్యకు గురైన తీరు..
(Photo: fbi.gov)
ప్రపంచంలో ఎన్నో చిక్కువీడని హత్య కేసులు ఉన్నాయి. వాటిలో దశబ్దాల కిందట అమెరికాలో సంచలనం సృష్టించిన బ్లాక్ డహ్లియా హత్య కేసు ఒకటి. ఆమె ఏమీ పెద్ద సెలబ్రిటీ కాదు, రాజకీయ నాయకురాలూ కాదు. కానీ.. ఆమె హత్యకు గురైన తీరు, కేసు దర్యాప్తు, ఆమెను చంపిన హంతకుడిని నేనే అంటూ వందలాది మంది పోలీసులకు లొంగిపోయిన ఘటనలు, వారిలో ఏ ఒక్కరూ హంతకులుగా తేలకపోవడం, దశాబ్దాలు గడిచినా అసలు హంతకుడు దొరకకపోవడంతో ఈ కేసు అమెరికా వ్యాప్తంగా సంచలనమైంది. ఇంతకీ ఆమె ఎవరు? హత్య ఎలా జరిగింది? హంతకుడెవరై ఉండవచ్చు?
ఎలిజబెత్ షార్ట్.. బోస్టన్లో 1924లో జన్మించింది. 18 ఏళ్లు నిండిన తర్వాత తల్లి దగ్గర నుంచి కాలిఫోర్నియాలో ఉండే తండ్రి వద్దకు వచ్చింది. అక్కడ ఆమెకు ఆయనతో విభేదాలు రావడంతో బయటకు వెళ్లిపోయింది. నటి అవ్వాలన్న కోరికతో లాస్ ఏంజిలస్ చేరుకుంది. చిరుద్యోగం చేసుకుంటూ సినీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుండేది. ఉన్నట్టుండి 1947 జనవరి 9న కనిపించకుండా పోయింది. ఆరు రోజుల తర్వాత అంటే జనవరి 15న లీమెర్ట్ పార్క్ వద్ద ఆమె మృతదేహం కనిపించింది. అటుగా వెళ్తున్న ఓ మహిళ.. ఎలిజబెత్ మృతదేహం పడి ఉన్న తీరు చూసి భయపడిపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమె మృతి చెందిన వార్త వెలుగులోకి వచ్చింది.
శరీరం రెండు భాగాలైంది.. చుక్క రక్తం లేదు!
ఎలిజబెత్ను హంతకులు అతి కిరాతకంగా హత్య చేశారు. నగ్నంగా ఉన్న ఆమె శరీరాన్ని రెండు ముక్కలుగా నరికారు. పెదాలను చెక్కి.. ముఖం నవ్వుతూ కనిపించేలా దవడలను చీల్చారు. ఒంటి నిండా తీవ్రమైన గాయాలున్నాయి. కానీ, మృతదేహం పడి ఉన్నచోట రక్తపు మరకలేవీ లేవు. మృతదేహం పాలిపోయి తెల్లగా మారిపోయింది. దీన్నిబట్టి.. హంతకులు ఆమెను తీవ్రంగా హింసించి చంపి, రక్తమంతా తొలగించి మృతదేహాన్ని తీసుకొచ్చి పడేశారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. గతంలో ఎలిజబెత్ ఓ చిన్న కేసులో పోలీసులకు చిక్కడంతో అప్పుడు తీసుకున్న వేలిముద్రల ఆధారంగా మృతదేహం ఆమెదేనని పోలీసులు గుర్తించారు. కాగా.. హత్యకు గురైన తీరుతో ఎలిజబెత్ కేసు అందరికీ ఉత్కంఠగా మారింది.
బ్లాక్ డహ్లియా కేసుగా ఎలా మారింది?
ఎలిజబెత్ మృతి చెందడానికి ముందు ఏడాది అంటే 1946లో ‘ది బ్లాక్ డహ్లియా’అనే మర్డర్ మిస్టరీ సినిమా విడుదలైంది. అందులో ఓ మహిళ హత్యకు గురవుతుంది. ఆమెని హత్య చేసిన వాణ్ని ఎలా పట్టుకున్నారేది కథ. ఎలిజబెత్ కూడా అలాగే హత్యకు గురికావడం, హంతకుడు పోలీసులకు చిక్కకుండా పారిపోవడంతో ప్రజలు ఎలిజబెత్ హత్య ఘటనను సినిమాతో పోల్చారు. అలా ఆమెను బ్లాక్ డహ్లియాగా.. కేసును బ్లాక్ డహ్లియా కేసుగా పిలువసాగారు. దీంతో పోలీసులు అధికారికంగానూ ఈ కేసును బ్లాక్డహ్లియా కేసుగా మార్చారు.
నేనే హంతకుడినంటూ 500 మంది..
బ్లాక్ డహ్లియా కేసు సంచలనంగా మారడంతో దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించిన మరుసటి రోజు నుంచే దర్యాప్తు ముమ్మరం చేశారు. అనేక మందిని విచారించారు. అయితే, కేసు దర్యాప్తు ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే 60 మంది ఎలిజబెత్ను తామే చంపామంటూ పోలీసులకు లొంగిపోయారు. విచారణలో వారు హంతకులు కాదని తేలడంతో వదిలిపెట్టారు. హత్య జరిగి ఏళ్లు గడిచినా కేసును మాత్రం ఓ కొలిక్కి తీసుకురాలేకపోయారు. అప్పుడప్పుడు ఎలిజబెత్ను హత్య చేసింది తానేనంటూ కొంతమంది పోలీసుల వద్దకు వచ్చేవారు. అలా ఇప్పటి వరకు దాదాపు 500 మంది వరకు నేరం తామే చేశామంటూ పోలీసుల ముందు ఒప్పుకున్నారట. కానీ, దర్యాప్తులో వాళ్లెవరూ హంతకులు కాదని తేలింది. విచిత్రమేమిటంటే.. హంతకుడిని నేనే అంటూ వచ్చిన వారిలో కొంత మంది హత్య జరిగిన నాటికి పుట్టనేలేదు.
ఇప్పటికీ తేలని కేసుగా..
ఆరు దశాబ్దాలు గడిచిపోయినా.. ఎలిజబెత్ను చంపిన హంతకుడెవరో పోలీసులు కనిపెట్టలేకపోయారు. కొంతమంది సీరియల్ కిల్లర్లను గుర్తించి నిందితుల జాబితాలో చేర్చారు. కానీ, వారు హత్య చేయలేదని తేలింది. మరి కొంతమంది ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఎంత ప్రయత్నించినా హంతకుడు దొరక్కపోవడంతో ఈ కేసు అమెరికా చరిత్రలోనే చిక్కు వీడని, దారుణ హత్య కేసుగా మిగిలిపోయింది. దీంతో బ్లాక్ డహ్లియా హత్య కేసుపై ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ పుస్తకాలు కూడా విడుదలయ్యాయి.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య