మిరియాలు, తేనె, అల్లం కరోనాకు మందు కాదు!
మిరియాలు, తేనె, అల్లం కరోనా నుంచి కాపాడతాయంటూ వస్తున్న వార్తలను పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ట్విటర్ ఖాతా కొట్టిపారేసింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఓ అధ్యయనంలో ఇది నిరూపితమైందని, ఆ అధ్యయనాన్ని....
పుకార్లను నమ్మొద్దన్న పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ట్విటర్ ఖాతా
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. కొవిడ్ మరణాలు 2 లక్షలకు చేరువయ్యాయి. మహమ్మారి కట్టడికి ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నాయి. రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో వైద్యులు సూచిస్తూనే వస్తున్నారు. అయితే ఇవి తీసుకుంటే కొవిడ్ మీ దరికి కూడా చేరదంటూ కొన్ని లింకులు, మెసేజ్లో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మిరియాలు, తేనె, అల్లం కరోనా నుంచి కాపాడతాయంటూ వస్తున్న వార్తలను పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ట్విటర్ ఖాతా కొట్టిపారేసింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఓ అధ్యయనంలో ఇది నిరూపితమైందని, ఆ అధ్యయనాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా అంగీకరించినట్లు స్పష్టం చేసింది. ఈ విపత్కర సమయంలో ప్రజలను తప్పుదారి పట్టించే మెసేజ్లు ఫార్వర్డ్ చేయొద్దని సూచించింది. అధికారిక వార్తలను మాత్రమే విశ్వసించాలని ప్రజలకు సూచించింది.
కరోనాను అధిగమించేందుకు మిరియాలు, తేనె, అల్లంను ఆహారం తీసుకోవాలని ఇప్పటివరకూ ఏ అధ్యయనం కూడా వెల్లడించలేదు. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు వీటిని తీసుకోవచ్చు కానీ ఇవి కరోనాను అధిగమించేందుకు సహకరించవు. శారీరక వ్యాయామం చేయాలని, ధ్యానం, యోగా ఆరోగ్యానికి మంచివని.. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచేందుకు ఇవి సహాయపడతాయని వైద్యులు చూసిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..