Ind vs Aus: ఉప్పల్లో బ్లాక్ టికెట్ల దందా.. ముగ్గురి అరెస్టు
ఉప్పల్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ 20 మ్యాచ్ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో
హైదరాబాద్: ఉప్పల్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ 20 మ్యాచ్ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో బ్లాక్ టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బ్లాక్ టికెట్స్ దందా చేస్తున్న ముగ్గురు నిందితులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 6 టికెట్లు, మూడు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గుగులోత్ వెంకటేశ్, ఇస్లవత్ దయాకర్, గుగులోత్ అరుణ్గా గుర్తించారు. నిందితులు రూ.850 టికెట్లను రూ.11 వేలకు అమ్ముతుండగా పట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
మరోవైపు ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్లో నిర్ణయాత్మక మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. ఉప్పల్ మైదానం వద్ద 2,500 మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. మైదానం చుట్టుపక్కల 15 కి.మీ మేర నిఘా ఏర్పాటు చేశారు. సుమారు 300 కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?