Telangana News: మాంగళ్య, సౌత్‌ ఇండియా షాపింగ్ మాల్స్‌కి బాంబు బెదిరింపు

కరీంనగర్‌లోని మూడు షాపింగ్‌ మాల్స్‌కి బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. నగరంలోని సౌత్‌ ఇండియా, మాంగళ్య, వీఆర్‌కే సిల్క్స్‌ మాల్స్‌కు

Updated : 16 May 2022 16:34 IST

కరీంనగర్‌ (క్రైమ్‌): కరీంనగర్‌లోని మూడు షాపింగ్‌ మాల్స్‌కి బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. నగరంలోని సౌత్‌ ఇండియా, మాంగళ్య, వీఆర్‌కే సిల్క్స్‌ మాల్స్‌కు ఓ వ్యక్తి ఫోన్‌ చేసి బాంబు పెట్టినట్లు చెప్పాడు. దీంతో మాల్స్‌ యజమానులు, సిబ్బంది హైరానా పడ్డారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో మాల్స్‌కి వెళ్లిన పోలీసులు సుమారు రెండు గంటలపాటు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అనంతరం ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు. ఓ ఆకతాయి ఫోన్‌ చేసి బాంబు ఉన్నట్లు బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్‌ చేసిన వ్యక్తి నంబరు ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని