
Updated : 28 Jul 2020 22:48 IST
వరవరరావును కలిసేందుకు అనుమతి
ముంబయి: భీమా కోరెగావ్ కేసులో నిర్బంధానికి గురైన విరసం నేత వరవరరావును కలిసేందుకు ఎట్టకేలకు వారి కుటుంబ సభ్యులకు అనుమతి లభించింది. ఆయనను కలిసేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ అర్జీ పెట్టుకున్న నేపథ్యంలో బాంబే హైకోర్టు అనుమతించింది. ఇటీవలే కరోనా బారిన పడిన వరవరరావు ప్రస్తుతం నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆస్పత్రి వద్ద కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అనుమతిచ్చింది. వరవరరావును విడుదల చేయాలంటూ కొన్ని రోజులుగా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఆయన ఆరోగ్యం గురించి కొన్ని రోజులుగా కుటుంబం ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఇప్పటికే ఆయన ఆరోగ్యం గురించి పలుమార్లు మహారాష్ట్ర హోంమంత్రికి ఆయన భార్య లేఖ రాశారు.
Tags :