Bopparaju: నాలుగో దశ ఉద్యమం మా చేతుల్లో ఉండదు: బొప్పరాజు
ఉద్యోగ సంఘాల ఉద్యమాలతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జీవోలు జారీ చేసిందని.. కానీ ఆర్థికాంశాలతో ముడిపడిన డిమాండ్లు పరిష్కారం కాలేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

విజయవాడ: ఉద్యోగ సంఘాల ఉద్యమాలతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జీవోలు జారీ చేసిందని.. కానీ ఆర్థికాంశాలతో ముడిపడిన డిమాండ్లు పరిష్కారం కాలేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. జూన్ 10లోపు ప్రభుత్వం స్పందించకుంటే నాలుగోదశ ఉద్యమం చేపడతామని చెప్పారు. జూన్ 8న గుంటూరులో నిర్వహించనున్న ఏపీ జేఏసీ అమరావతి ప్రాంతీయ సదస్సు పోస్టర్లను ఆయన విడుదల చేశారు.
గత 84 రోజులుగా తమ ఉద్యమం కొనసాగిస్తున్నామని.. దీన్ని చులకగా చూస్తే ప్రభుత్వానిదే తప్పు అని బొప్పరాజు అన్నారు. నాలుగో దశలో ఉద్యోగులు ప్రత్యక్షంగా పాల్గొంటారని.. అప్పుడు ఉద్యమం తమ చేతుల్లో ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. సీఎస్తో చర్చలకు గురువారం వెళ్తున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Congress-CPI: కాంగ్రెస్-సీపీఐ పొత్తు.. చర్చలు కొనసాగుతున్నాయ్: చాడ వెంకట్రెడ్డి
-
Amazon: గ్రేట్ ఇండియన్ సేల్కు అమెజాన్ రెడీ.. వీటిపైనే డీల్స్!
-
YouTuber: మెట్రోలో టికెట్ లేకుండా ప్రయాణం.. యూట్యూబర్పై నెటిజన్ల ఫైర్!
-
TSPSC: పోటీపరీక్షల నిర్వహణపై అనుమానాలున్నాయ్!.. విపక్షాల మండిపాటు
-
అలాంటి పోలీసు చిత్రాలు డేంజర్: బాంబే హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు
-
Chandrababu arrest: ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి అనుమతి లేదు: విజయవాడ సీపీ