ఆ లాయర్ ఎత్తు ఎంతంటే..?
సంకల్పం దృఢంగా ఉంటే ఎన్ని అవరోధాలు, అవమానాలు ఎదురైనా లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించారు పంజాబ్కు చెందిన హర్విందర్కౌర్ అలియాస్ రూబి (24). మూడు అడుగుల 11 అంగుళాల ఎత్తున్న ఆమె....
జలంధర్: సంకల్పం దృఢంగా ఉంటే ఎన్ని అవరోధాలు, అవమానాలు ఎదురైనా లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించారు పంజాబ్కు చెందిన హర్విందర్కౌర్ అలియాస్ రూబీ (24). మూడు అడుగుల 11 అంగుళాల ఎత్తున్న ఆమె.. లాయర్ కొలువు సాధించి అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దివ్యాంగుల కోసం కోర్టులో ఉచితంగా వాదనలు వినిపిస్తానని పేర్కొంటున్నారు. తోటివారు హేళన చేస్తున్నారని స్కూల్ మానేసిన రూబీ.. లాయర్గా ఎలా మారారో తెలిస్తే ఎవరైనా ప్రశంసించకుండా ఉండలేరు.
జలంధర్ రామ మండిలోని అర్మాన్నగర్లో నివసించే రూబీ జీవితం పదేళ్ల వరకు సాఫీగానే సాగింది. తోటి పిల్లలతో కలిసి సరదాగా ఆడుకునేది. అయితే వయసు పెరుగుతున్నా ఆమె ఎత్తు అంతగా పెరగలేదు. దీంతో తాను ఇతరుల్లా కాదని రూబీకి తన పదో ఏటనే అర్థమైంది. ఇతరులు తనను చిన్నచూపు చూడటం, గేలి చేయడం భరించలేకపోయింది. దీంతో పాఠశాలకు వెళ్లడం తగ్గించేసింది. ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపేది. ఇంట్లోనే చదువుకుంటూ 10వ తరగతి, ఇంటర్ పాసయ్యింది. తన శక్తిసామర్థ్యాలపై తనకే విశ్వాసం సన్నగిల్లితున్న తరుణంలో ఆత్మవిశ్మాసాన్ని పెంపొందించుకుంది. ఏదైనా సాధించాలని నిశ్చయించుకొంది. డిగ్రీలో అడ్మిషన్ తీసుకొని రెగ్యులర్గా కాలేజీకి వెళ్లేది.
తాను మొదట ఎయిర్ హోస్టెస్ కావాలనుకున్నానని, కానీ అది సాధ్యం కాదని తెలిసి లాయర్ అవ్వాలనుకున్నట్లు రూబీ పేర్కొన్నారు. తమ ఇంట్లో అందరూ సాధారణ ఎత్తే ఉంటారని తెలిపారు. కేవలం లా పూర్తి చేయడమే కాకుండా, అందరి మనసులు గెలుచుకోవాలని తాను అనుకున్నట్లు వివరించారు. లాయర్ అయ్యాక అందరూ తనను గౌరవిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జిల్లా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జగ్పాల్ సింగ్ వద్ద లా ప్రాక్టీస్ చేస్తున్నారు. దివ్యాంగుల తరఫున కోర్టులో ఉచితంగా వాదిస్తానని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల