Goa: వెళ్లాలంటే.. రెండు డోసులు పడాల్సిందే..!
కరోనా కేసుల్లో తగ్గుదల నేపథ్యంలో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు పర్యాటకానికి గేట్లు తెరిచాయి. లాక్డౌన్తో ఇళ్లకే పరిమితమైన యాత్రికులు
పానాజి: కరోనా కేసుల్లో తగ్గుదల నేపథ్యంలో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు పర్యాటకానికి గేట్లు తెరిచాయి. లాక్డౌన్తో ఇళ్లకే పరిమితమైన యాత్రికులు ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటక ప్రదేశాలకు పోటెత్తుతున్నారు. అయితే గోవా వెళ్లాలంటే మాత్రం కొన్ని నిబంధనలు పాటించాల్సిందేనని అక్కడి సర్కారు చెబుతోంది. కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారిని మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తామంటోంది. ఈ మేరకు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సోమవారం కీలక ప్రకటన చేశారు. టీకా రెండు డోసులు తీసుకున్నవారు గోవా సందర్శించేందుకు కొవిడ్ నెగెటివ్ ధ్రువపత్రాన్ని చూపించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. కేవలం టీకా తీసుకున్న ధ్రువపత్రాన్ని చూపిస్తే సరిపోతుందన్నారు. పర్యాటకులకు మాత్రమే కాకుండా వ్యాపార, ఇతర కార్యకలాపాల కోసం రాష్ట్రానికి వచ్చేవారికి సైతం ఇవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు.
గోవాలో కరోనా పాజిటివిటీ రేటు ఆరు శాతానికి తగ్గిపోయిందని.. రానున్న కొద్ది రోజుల్లో ఇది 5 శాతానికి తగ్గుతుందని ప్రమోద్ సావంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. రికవరీ రేటు సైతం గణనీయంగా పెరగడం మంచి పరిణామమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో కరోనా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయివేటు ప్రయోగశాలల యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. జులై 30 నాటికి రాష్ట్రంలో 100 శాతం ప్రజలకు మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నట్టు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం