Turkey: అధ్యక్షుడు చేయాల్సిన రిబ్బన్ కటింగ్.. ఓ బుడ్డోడు ఏం చేశాడంటే..?
టర్కీలో ఓ బుడ్డోడు చేసిన పనికి అందరూ అవాక్కవుతున్నారు. ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తైపీ ఎర్డోగాన్
ఇంటర్నెట్ డెస్క్: టర్కీలో ఓ బుడ్డోడు చేసిన పనికి అందరూ అవాక్కవుతున్నారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తైపీ ఎర్డోగాన్.. హైవే టన్నెల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆ వేడుకకు వచ్చిన ఓ బాలుడు ఎర్డోగాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందే అసహనానికి గురయ్యాడు. దీంతో అతని చేతిలో ఉన్న కత్తెరతో రిబ్బన్ కట్ చేసి టన్నెల్ను ప్రారంభించాడు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియోలో కొంతమంది పిల్లలు వేదికపై అధ్యక్షుడి ముందు వరుసలో నిలుచున్నారు. ఒక వైపు కార్యక్రమ ప్రారంభం గురించి మాట్లాడుతుండగానే ఓ బాలుడు రిబ్బన్ను కత్తిరించాడు. తర్వాత దాన్ని పట్టుకునే ఉంటాడు. తన తప్పును కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తాడు. అది గుర్తించిన అధ్యక్షుడు ఎర్డోగాన్ ఆ పిల్లోడి తలపై చేయి వేసి.. అతనితో మాట్లాడాడు. కార్యక్రమం పూర్తయిన తర్వాత పిల్లలతో ముచ్చటిస్తూ సరదాగా హై ఫై ఇస్తాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. ‘బుడ్డోడి చిన్న చేతులతో హైవే టన్నెల్ ప్రారంభమయ్యింది. భవిష్యత్తులో అంతా సవ్యంగానే జరుగుతుంది’ అని ఒకరు రాసుకొచ్చారు.
కాగా.. దీనిపై మరొక ట్విటర్ యూజర్ స్పందిస్తూ..‘‘ఈ పిల్లాడు ఏ తప్పు చేయలేదు. ఎందుకంటే, అది ఒక్క అధ్యక్షుడు మాత్రమే కట్ చేయాల్సింది కాదు. పిల్లలతో కూడా రిబ్బన్ కట్ చేయించాల్సి ఉంది. వారిలో చాలామంది చేతుల్లో కత్తెర ఉంది. కానీ, ఆ బాలుడు తొందరపడి అందరికంటే ముందు రిబ్బన్ను కత్తిరించాడు’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్