Bride marries: ముహూర్త సమయానికి కరెంటు పోవడంతో మరొక వరుడుని పెళ్లాడిన వధువు

పెళ్లి ముహుర్తం సమయానికి కరెంటు పోవడంతో వధువు ఒకరిని బదులు మరొకరిని పెళ్లి చేసుకుంది. మరుసటి రోజు వరకు ఈ విషయాన్ని ఎవరూ కనుక్కోలేక పోవడం గమనార్హం.

Published : 10 May 2022 02:22 IST

భోపాల్‌ : పెళ్లి ముహూర్త సమయానికి కరెంటు పోవడంతో వధువు ఒకరిని బదులు మరొకరిని పెళ్లి చేసుకుంది. మరుసటి రోజు వరకు ఈ విషయాన్ని ఎవరూ కనుక్కోలేక పోవడం గమనార్హం. దీంతో మరోసారి పెళ్లి వేడుక నిర్వహించారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ వింత ఘటన వివరాల్లోకి వెళితే.. ఉజ్జయిన్‌లో నివసించే రమేష్‌ లాల్‌కు నిఖిత, కరిష్మా అనే ఇద్దరు కుమార్తెలు. ఆదివారం వాళ్లిదరికీ వేర్వేరు కుటుంబాలకు చెందిన వ్యక్తులతో వివాహం చేయాలని నిర్ణయించారు. ముహూర్త సమయానికి కరెంటు పోవడంతో చెల్లి తన సోదరి వరుడిని పెళ్లి చేసుకుంది. ఇద్దరూ ఒకేరకమైన పెళ్లి దుస్తులు ధరించి ఉండడంతో ఎవరూ ఈ విషయాన్ని కనుక్కోలేక పోయారు. అంతా ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లాకా ఈ విషయం బయటపడింది. దీంతో కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు కుటుంబాలు మరుసటి రోజు మళ్లీ వివాహ వేడుకను నిర్వహించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని