Andhra news: తమ్ముడూ నేనూ వస్తున్నా.. గంటల వ్యవధిలో ఆగిన గుండెలు
ప్రకాశం జిల్లాలో గంటల వ్యవధిలో ఇద్దరు అన్నదమ్ములు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో విషాదఛాయలు అలముకున్నాయి.
పెద్దారవీడు: ఒకే కడుపున పుట్టిన ఆ అన్నదమ్ములు ఇద్దరూ గంట వ్యవధిలో మృతి చెందారు. స్నేహితుల్లా అన్యోన్యంగా ఉండే ఆ ఇద్దరి బంధం గంటల వ్యవధిలోనే గాల్లో కలిసిపోయింది. మొదట తమ్ముడు గుండెపోటు (Heart attack)కు గురయ్యారు. ఆయన ఆకాల మరణాన్ని తట్టుకోలేకపోయిన అన్న.. గుండెలవిసేలా రోదించి కుప్పకూలిపోయాడు. అతడికి కూడా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికుల హృదయాలను కలిచివేసింది. కష్టం వస్తే ఒకరికొకరు తోడుగా ఉంటూ భరోసా ఇచ్చుకునే వారని గ్రామస్థులంతా కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషాద సంఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని బద్వీడు చెర్లోపల్లిలో సోమవారం చోటుచేసుకుంది.
మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పెద్ద అల్లూరిరెడ్డి (67), చిన్న అల్లూరిరెడ్డి(65) అన్నదమ్ములు. సోమవారం తెల్లవారుజామున చిన్న అల్లూరిరెడ్డికి గుండె పోటు రావడంతో మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని వివరించారు. తమ్ముడి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొస్తున్నారని తెలుసుకున్న సోదరుడు పెద్ద అల్లూరిరెడ్డి ఆవేదనకు గురయ్యారు. గుండెలవిసేలా రోదించారు. ఈ క్రమంలోనే ఆయనకు గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబాల్లో, గ్రామంలో విషాద ఛాయాలు అలముకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రుషికొండలో ఏం జరిగింది?!
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సోమవారం రాత్రి తీవ్ర కలకలం రేగింది. -
గత లోపాలు పునరావృతం కాకుండా చందనోత్సవం
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం గత ఏడాది ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాన్ని పక్కా ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ సింహాచలం దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తిని ఆదేశించారు. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
TS High Court: తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. ఈమేరకు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
-
AP News: తెలుగు రాద్దామనుకుంటే.. హిందీ ప్రశ్నపత్రం వచ్చింది
-
బస్సుల్లేక బాధలు.. తికమకలో మరో కేంద్రానికి విద్యార్థిని
-
cVIGIL: మీరు గానీ విజిలేస్తే.. మడతెట్టేస్తారు!
-
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు