భారత్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దు భద్రతా దళాల సమావేశం

భారత్‌, బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళాల(బీఎస్‌ఎఫ్‌) సమన్వయ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. మూడురోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించనున్న ఈ సమావేశం గురువారంతో ముగియనుందని అధికారులు వెల్లడించారు

Published : 22 Jun 2021 22:55 IST

దిల్లీ: భారత్‌, బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళాల(బీఎస్‌ఎఫ్‌) సమన్వయ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. మూడురోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించనున్న ఈ సమావేశం గురువారంతో ముగియనుందని అధికారులు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సరిహద్దును సమర్థంగా నిర్వహించడంలో భాగంగా అక్కడ జరిగే నేరాలు, అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు చర్యలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. పరస్పర సమన్వయంతో గస్తీ నిర్వహించడం, సాంకేతిక సహకారం, ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు తదితర అంశాలకు సంబంధించి సరిహద్దు నిర్వహణ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. ఇరు దేశాల ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకొని.. సరిహద్దులో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ సమావేశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇరు దేశాల భద్రతా దళాల మధ్య మైత్రిని పెంపొందించడం కూడా ఇందులో భాగమన్నారు. 

ఇలాంటి సమావేశం నిర్వహించడం ఈ నెలలో ఇది రెండోసారి. ఈ నెల 7న ప్రారంభమైన సరిహద్దు సమన్వయ సమావేశం నాలుగు రోజులపాటు నిర్వహించిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని