ఏడేళ్లలో రూ.76,262 కోట్ల అప్పు తీర్చాలి
తెలంగాణలో ద్రవ్యలోటు, చెల్లించాల్సిన రుణ బాధ్యతలు.. 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన శాతాలకు లోబడే
ఉభయ సభల ముందుకు కాగ్ నివేదిక
హైదరాబాద్: తెలంగాణలో ద్రవ్యలోటు, చెల్లించాల్సిన రుణ బాధ్యతలు.. 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన శాతాలకు లోబడే ఉన్నాయని కాగ్ తెలిపింది. ప్రాథమిక లోటులో తగ్గుదల ఉన్నప్పటికీ ప్రాథమిక వ్యయాన్ని భరించే స్థాయిలో అప్పులు మినహా ఇతర రాబడి లేదని కాగ్ వ్యాఖ్యానించింది. బడ్జెట్ అంచనాలకు, వాస్తవాలకు మధ్య తేడా తగ్గేలా బడ్జెట్ తయారీ ప్రక్రియను హేతుబద్దీకరించాలని సూచించింది.
వ్యవసాయానికి అగ్ర ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ... విద్య, రవాణా, క్రీడలు, కళలకు ఖర్చును తగ్గిస్తోందని కాగ్ అభిప్రాయపడింది. సాగునీటి ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ వాటి ఆర్థిక ఫలితాలను ప్రభుత్వం వెల్లడించలేదని పేర్కొంది.
2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై నివేదిక ఇచ్చిన కాగ్ రెవెన్యూ రాబడి, రెవెన్యూ ఖర్చుల పెరుగుదల 2015-16 నుంచి 2018- 19 మధ్య కాలంలో మెరుగైందని, జీఎస్డీపీలో రెవెన్యూ రాబడి, ఖర్చులు మాత్రం స్వల్పంగా తగ్గాయని పేర్కొంది. అంతకు ముందుతో పోల్చినా, జీఎస్టీడీపీతో పోల్చినా క్యాపిటల్ వ్యయం తగ్గిందని పేర్కొంది. 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 3.25శాతం కన్నా ద్రవ్యలోటు జీఎస్డీపీలో తక్కువగానే 3.11శాతం ఉందని పేర్కొంది. చెల్లించాల్సిన రుణ బాధ్యతలు జీఎస్డీపీతో పోల్చితే 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 23.33 శాతం కన్నా తక్కువగానే 22.75 శాతం ఉందని తెలిపింది. 2019 మార్చి నాటి ప్రకారం ప్రభుత్వ అప్పులలో 46శాతం రూ,76,262 కోట్లను రానున్న ఏడేళ్లలో తీర్చాల్సి ఉంది. శాసనసభ ఆమోదం లేకుండా 2014-15 నుంచి 2017-18 మధ్య రూ.55,517 కోట్లు అధికంగా ఖర్చే చేసిందని, వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కాగ్ సిఫారసు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు