Health: పెద్ద పేగులో క్యాన్సర్ ఉంటే.. ఇలా కనిపెట్టవచ్చు...!
పేరుకే పెద్దపేగు దాని ప్రాధాన్యం పెద్దదే కానీ ఇది జీర్ణ వ్యవస్థలో ఎక్కడో ఉంటుంది. అయినా పెద్ద పేగు ప్రాముఖ్యం అంతాఇంతా కాదు.
ఇంటర్నెట్ డెస్క్: పెద్దపేగు దాని ప్రాధాన్యం పెద్దదే కానీ ఇది జీర్ణ వ్యవస్థలో ఎక్కడో ఉంటుంది. అయినా పెద్ద పేగు ప్రాముఖ్యం అంతాఇంతా కాదు. సాధారణ నీళ్ల విరేచనాలు మొదలుకొని ప్రమాదకర క్యాన్సర్ల వరకు ఎన్నో సమస్యలు పెద్ద పేగులో కనిపిస్తాయి. ఇందులో వచ్చే వ్యాధులను ముందుగానే ఎలా పసిగట్టాలి. చికిత్స ఎలా చేయించుకోవాలి. పెద్దపేగులో క్యాన్సర్ వస్తే ముందుగానే తెలుసుకోవడానికి వీలుందా...? ఈ అనుమానాల గురించి వైద్యులు పలు విషయాలు తెలిపారు.
* పెద్ద పేగులో కనిపించే అతి పెద్ద విపత్తు క్యాన్సర్. ఈ వ్యాధితో ఏటా వేలాది మంది చనిపోతున్నారు.
* ఏ మాత్రం అనుమానం ఉన్నా కొలనోస్కోపీ చేయించుకోవడం ద్వారా వ్యాధి నిర్థారణ చేసుకోవడానికి వీలవుతుంది.
* 50 ఏళ్లు దాటిన తర్వాత విసర్జనలో మార్పులుంటే అనుమానించాలి. మల విసర్జనలో రక్తం పడుతున్నా. మలబద్ధకం తీవ్రంగా ఉన్నా ఆగకుండా నీళ్ల విరేచనాలు అవుతున్నా, తరచుగా కడుపులో నొప్పి ఉన్నపుడు వైద్యులను సంప్రదించాల్సిందే.
* మల విసర్జనకు వెళ్లినా ఇంకా మళ్లీ వెళ్లాలని అనిపించడం, క్రమంగా బరువు తగ్గడంతో వైద్యుల వద్దకు వెళ్లాలి.
* గతంలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇలాంటి సమస్యలుంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొలనోస్కోపీ చేయించాలి. ఇది పెద్ద పేగులో క్యాన్సర్ ఉందో లేదో తేల్చుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు