TS News: మంత్రి తలసాని కుమారుడి కారు ఢీకొని వ్యక్తికి గాయాలు

ఖైరతాబాద్‌ సదర్‌ ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ఖైరతాబాద్‌ కూడలిలో సదర్‌ ఉత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కుమారుడు సాయి యాదవ్‌ సదర్‌ ఉత్సవాలకు హాజరయ్యారు....

Published : 06 Nov 2021 02:04 IST

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ సదర్‌ ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ఖైరతాబాద్‌ కూడలిలో సదర్‌ ఉత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కుమారుడు సాయి యాదవ్‌ సదర్‌ ఉత్సవాలకు హాజరయ్యారు. ఉత్సవాల్లో పాల్గొని తిరిగి కారులో వెళ్తుండగా.. ఓ వ్యక్తిపై నుంచి కారు వెళ్లడంతో అతని కాలుకు గాయాలయ్యాయి. బాధితుడి కుటుంబ సభ్యులు, స్థానికులు సాయి యాదవ్‌ను అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. గొడవ తీవ్రం కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని గాయపడిన వ్యక్తి కుటుంబానికి సర్థి చెప్పారు. బాధితుడిని పోలీసు వాహనంలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు