Delhi Liquor Scam: దిల్లీ మద్యం కుంభకోణం.. 10వేల పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసిన సీబీఐ
దిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ పదివేల పేజీల తొలి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తు ఆధారంగా మరికొన్ని ఛార్జ్షీట్లు దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ పదివేల పేజీల తొలి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్లో ఏ1గా అప్పటి అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ కుల్దీప్సింగ్ను, ఏ2గా అప్పటి అబ్కారీశాఖ అసిస్టెంట్ కమిషనర్ నరేందర్సింగ్, ఏ3గా విజయ్ నాయర్, ఏ4గా అభిషేక్ బోయిన్పల్లి పేర్లతోపాటు సమీర్ మహేంద్రు, రామచంద్ర పిళ్లై, ముత్తా గౌతమ్ పేర్లను చేర్చింది. కేసు దర్యాప్తు ఆధారంగా మరికొన్ని ఛార్జ్షీట్లు దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈడీ కూడా ఛార్జ్షీట్లు వేయనున్నట్లు సమాచారం. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ఆమోదంపై ఈనెల 30న రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకోనుంది.
మద్యం కుంభకోణానికి సంబంధించి తొలుత దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియా పేరు మారుమోగింది. గతంలో సీబీఐ ఆయనకు సమన్లు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, సీబీఐ తాజాగా దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఆయన పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ