ఇంటి వద్దే మ్యాథ్స్ .. సులువుగా నేర్చుకోండిలా!
కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులకు చదువులో ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. విషయాల్ని అర్థం చేసుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు గణిత విషయాన్ని సులువుగా అర్థం చేసుకునేలా సీబీఎస్ఈ సరికొత్త పద్ధతిని అందుబాటులోకి తెచ్చింది.
దిల్లీ: కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులకు చదువుకునేందుకు ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. వివిధ విషయాల్ని అర్థం చేసుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు గణితాన్ని సులువుగా అర్థం చేసుకునేలా సీబీఎస్ఈ సరికొత్త పద్ధతిని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం గణితం ఆన్లైన్ ప్రాక్టీస్ బుక్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సీబీఎస్ఈ ఓ ప్రకటనలో పేర్కొంది. దానికి సంబంధించిన వివరాలను కేంద్ర విద్యాశాఖ ట్విటర్ ద్వారా పరిచయం చేసింది.
సీబీఎస్ఈ తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఈ ప్రాక్టీస్ బుక్ ద్వారా విద్యార్థులు గణిత సమస్యలను సులువుగా అర్థం చేసుకోచ్చు. ఇందులో ఉండే గ్రాఫిక్స్, ఇమేజెస్ ద్వారా గణితంలోని విభిన్న టెక్నిక్లను అర్థం చేసుకుని.. సొంతంగా సమస్యలను సాధించగలరు. ఈ ప్రాక్టీస్ పుస్తకం 7 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రుల కనీస సహకారంతో విద్యార్థులు సొంతంగా గణితాన్ని నేర్చుకునేలా ఈ ప్రాక్టీస్ బుక్ ప్రోత్సహిస్తుంది’ అని సీబీఎస్ఈ తెలిపింది. సీబీఎస్ఈ వెబ్సైట్ ద్వారా ఈ ప్రాక్టీస్ బుక్ను పొందవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు