అన్ని టీకాలు సురక్షితం: రాకేశ్‌మిశ్రా

అనుకున్న స్థాయిలో వ్యాక్సినేషన్‌ సాగడం లేదని.. కొవిడ్‌ టీకాపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా అన్నారు. కార్డియోలాజికల్‌

Updated : 14 Mar 2021 14:43 IST

హైదరాబాద్: అనుకున్న స్థాయిలో వ్యాక్సినేషన్‌ సాగడం లేదని.. కొవిడ్‌ టీకాపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా అన్నారు. కార్డియోలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ఆరో వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకా అవసరమన్నారు. రెండో డోస్‌ తీసుకున్న 14 రోజులకు యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని పేర్కొన్నారు. దాదాపు 20 నుంచి 30 శాతం మందిలో తొలిడోస్‌ నుంచే యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని వెల్లడించారు. అన్ని టీకాలు సురక్షితమని.. యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపారు. కరోనా కేసుల పెరుగుదలపై స్పందిస్తూ.. నిబంధనలు పాటించకపోవడం వల్లే పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో 55.5 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని