Sundara Naidu: సుందరనాయుడి భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు

పౌల్ట్రీ పరిశ్రమ మార్గదర్శి, బాలాజీ హేచరీస్‌ అధినేత డాక్టర్‌ ఉప్పలపాటి సుందర నాయుడి మృతి తీరనిలోటని పలువురు ప్రముఖులు ఆయన సేవలను

Published : 30 Apr 2022 14:10 IST

చిత్తూరు: పౌల్ట్రీ పరిశ్రమ మార్గదర్శి, బాలాజీ హేచరీస్‌ అధినేత డాక్టర్‌ ఉప్పలపాటి సుందర నాయుడి మృతి తీరనిలోటని పలువురు ప్రముఖులు ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. చిత్తూరు నగరం సుందరనగర్‌లోని సుందరనాయుడు స్వగృహంలో ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. సుందరనాయుడి అంత్యక్రియల్లో భాగంగా రెండో రోజైన ఇవాళ సినీ నటుడు మోహన్‌బాబు, మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, అమరరాజా గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ గల్లా రామచంద్రనాయుడు, అమరరాజా ఆస్పత్రి ఎండీ గౌరినేని రమాదేవి, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు ఇతర ప్రముఖులు సుందరనాయుడు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. సుందరనాయుడు కుమార్తె, మార్గదర్శి ఎండీ శైలజను ఓదార్చారు. వేల మంది రైతులు, యువతను కోళ్ల పరిశ్రమ వైపు నడిపించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మార్గదర్శి సుందరనాయుడు అని కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని