‘ఆ ఉద్యోగులను కేంద్రం అలా బెదిరించలేదు’
ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్ వంటి సోషల్మీడియా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను జైలుశిక్ష పేరుతో కేంద్రం బెదిరిస్తోందని వచ్చిన ఆరోపణలపై కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ స్పందించింది. ప్రభుత్వం ‘సోషల్మీడియా’ ఉద్యోగులను ఎప్పుడూ అలా బెదిరించలేదని వెల్లడించింది. ఇతర వ్యాపార సంస్థలు పాటిస్తున్నట్లుగా
స్పష్టం చేసిన ఐటీ మంత్రిత్వశాఖ
దిల్లీ: ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్ వంటి సోషల్మీడియా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు జైలుశిక్ష విధిస్తామని కేంద్రం బెదిరిస్తోందని వచ్చిన ఆరోపణలపై కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ స్పందించింది. ప్రభుత్వం ‘సోషల్మీడియా’ ఉద్యోగులను ఎప్పుడూ అలా బెదిరించలేదని వెల్లడించింది. ఇతర వ్యాపార సంస్థలు పాటిస్తున్నట్లుగా భారత చట్టాలను, భారత రాజ్యాంగాన్ని పాటించడం సోషల్మీడియా సంస్థల బాధ్యత అని పేర్కొంది.
నిబంధనలను ఉల్లంఘిస్తున్న వందలాది పోస్టులు, ఖాతాలు, హ్యాష్ట్యాగ్లను తొలగించాలని ట్విటర్ను కేంద్రం ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. మొదట ఇందుకు ట్విటర్ ఒప్పుకోలేదు. దీంతో సమాచార చట్టాల ప్రకారం కేంద్రం ఆదేశాలను అమలు చేయకపోతే భారత శిక్షాస్మృతి ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించింది. ఆ తర్వాత పార్లమెంట్లో ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అమెరికాకు చెందిన సోషల్మీడియా సంస్థలు భారత చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. దీంతో సోషల్మీడియా ఉద్యోగులను కేంద్రం బెదిరిస్తోందని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణ అవాస్తమని సమాచార మంత్రిత్వశాఖ తాజాగా వివరణ ఇచ్చింది. ప్రభుత్వం రాతపూర్వకంగా గానీ, మాట రూపంలో గానీ ఏ సోషల్మీడియా ఉద్యోగికి జైలుశిక్ష విధిస్తామని బెదిరించలేదని స్పష్టం చేసింది.
‘సోషల్మీడియా యూజర్లు ప్రభుత్వాన్ని, మోదీని, ఏ మంత్రినైనా విమర్శించొచ్చు. కానీ, హింస, మతపరమైన విద్వేషాలు, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం వంటివి మంచిది కాదు. ద్వేషాన్ని పెంచుతూ, భారతదేశానికి వెలుపల నుంచి హింసను, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం, మహిళల ఫొటోలు మార్ఫింగ్ చేయడం, మహిళలపై ఈ-వేధింపులు వంటివి తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి’అని ఐటీమంత్రిత్వశాఖ ఆవేదన వ్యక్తం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’