సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5వేల అప్రెంటిస్ ఖాళీలు.. స్టైఫండ్ ఎంతంటే?
central bank of India: సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది.
ముంబయి: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు సెంట్రల్బ్యాంక్ ఆఫ్ ఇండియా(Central bank of India) అప్రెంటిస్షిప్ శిక్షణకు భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ శిక్షణలో భాగంగా 5000 ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిగ్రీ/తత్సమాన విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 3వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఏప్రిల్ రెండో వారంలో ఆన్లైన్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం ఖాళీల్లో ఏపీ నుంచి 141 (విజయవాడ రీజన్లో 41, గుంటూరు 60, విశాఖ 40చొప్పున) ఖాళీల్ని భర్తీ చేయనుండగా.. తెలంగాణలో 106(హైదరాబాద్ 65, వరంగల్ 41 చొప్పున) భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ముఖ్యాంశాలివే..
- దరఖాస్తులు ప్రారంభం: మార్చి 20న
- దరఖాస్తులకు తుది గడువు: ఏప్రిల్ 3
- శిక్షణ కాలం: ఒక ఏడాది పాటు ఉంటుంది.
- స్టైఫండ్: రూరల్/సెమీ అర్బన్ బ్రాంచ్లలో నెలకు రూ.10వేలు, అర్బన్ బ్రాంచుల్లో రూ.12000, మెట్రో శాఖల్లో అయితే రూ.15000 చొప్పున ఇవ్వనున్నారు. దీనికితోడు ఉద్యోగం నిమిత్తం బయటకు వెళ్లినప్పుడు ఖర్చుల కోసం కొంత మొత్తం ఇస్తారు.
- వయోపరిమితి: మార్చి 31 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.
- పరీక్ష ఫీజు: జనరల్ కేటగిరీ అభ్యర్థులకైతే రూ.800; దివ్యాంగుంగులైతే రూ.400, ఎస్సీ/ఎస్టీ/మహిళలకు రూ.600లుగా నిర్ణయించారు. ఈ ఫీజుకు జీఎస్టీ అదనం.
- పరీక్షవిధానం: ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిట్నెస్ పరీక్ష, స్థానిక భాషలో ప్రావీణ్యతను చూస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
-
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ