Drgus: ఏపీలోనే మాదకద్రవ్యాల స్మగ్లింగ్ అధికం: కేంద్రం నివేదిక
దేశవ్యాప్తంగా 2021-22లో అత్యధికంగా ఏపీలోనే మాదకద్రవ్యాలు లభ్యమైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
దిల్లీ: దేశవ్యాప్తంగా 2021-22లో అత్యధికంగా ఏపీలోనే మాదకద్రవ్యాలు లభ్యమైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు దేశంలో 2021-22లో పట్టుబడిన మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాలపై ‘స్మగ్లింగ్ ఇన్ ఇండియా’ 2021-22 పేరుతో కేంద్రం నివేదిక విడుదల చేసింది. ఒక్క ఏపీలోనే 18వేల కిలోల మాదకద్రవ్యాలు, వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా రూ.97 కోట్ల విలువైన 165 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. తెలంగాణలో వెయ్యి కిలోల డ్రగ్స్, మత్తు పదార్థాలు పట్టుబడినట్లు నివేదికలో పేర్కొంది. మరోవైపు దేశవ్యాప్తంగా మొత్తంగా 2021-22లో కస్టమ్స్ విభాగం రూ.17,394 కోట్ల విలువైన డ్రగ్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం రూ. 20,064 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.1,323 కోట్ల విలువైన బంగారం, విదేశీ నగదు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం తన నివేదికలో వెల్లడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Brahmanandam: ఏ జీవిగా పుట్టించినా నవ్వించాలనే కోరుకుంటా: బ్రహ్మానందం
-
Movies News
Kangana Ranaut: ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించండి: కంగనా రనౌత్
-
Politics News
New Front: నవీన్ పట్నాయక్తో మమత భేటీ.. కూటమిపై చర్చించారా..?
-
Sports News
Wasim Jaffer: సూర్యకుమార్కు బదులు సంజూ శాంసన్ని తీసుకోండి: వసీం జాఫర్
-
India News
Anand Mahindra: తోలుబొమ్మ ‘నాటు నాటు’.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్
-
World News
Russia: ‘పుతిన్ను అరెస్టు చేయడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే!’