Amit Shah: సాయిగణేశ్‌ కుటుంబీకులకు అమిత్‌షా ఫోన్‌

ఖమ్మంలో ఇటీవల ఆత్మహత్మ చేసుకున్న భాజపా కార్యకర్త సాయి గణేశ్‌ కుటుంబంతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌లో మాట్లాడారు.

Published : 19 Apr 2022 14:29 IST

ఖమ్మం: ఖమ్మంలో ఇటీవల ఆత్మహత్మ చేసుకున్న భాజపా కార్యకర్త సాయి గణేశ్‌ కుటుంబంతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌లో మాట్లాడారు. సాయిగణేశ్‌ మృతి పట్ల ఆయన తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి కుటుంబసభ్యులను పరామర్శించారు. సాయిగణేశ్‌ అమ్మమ్మ సావిత్రి, సోదరితో మాట్లాడి యువకుడి మృతిపై సంతాపం తెలిపారు. తమకు న్యాయం చేయాలని అమిత్‌షాను కుటుంబీకులు కోరగా.. పార్టీ తరఫున అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. అక్రమ కేసులతో పోలీసులు తనను వేధిస్తున్నారంటూ సాయిగణేశ్‌ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని