అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్‌

బోయిన్‌పల్లిలోని ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి..

Published : 24 Jan 2021 01:43 IST

హైదరాబాద్‌: బోయిన్‌పల్లిలోని ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి అఖిలప్రియకు సికింద్రాబాద్‌ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ధైర్యంగా ఉండాలని.. ఎన్ని కష్టాలు వచ్చినా మనోనిబ్బరంతో ముందుకు వెళ్లాలని ఫోన్‌లో అఖిలప్రియకు చంద్రబాబు చెప్పారు. తాను ధైర్యంగా ఉంటూనే తోటివారికి ధైర్యం చెప్పాలని అఖిలప్రియకు చంద్రబాబు సూచించారు.

ఇవీ చదవండి..

మాజీ మంత్రి అఖిలప్రియ విడుదల

సీఎం ఇంటిని ముట్టడిస్తే అత్యాచారయత్నం కేసా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని