ChandraBabu: ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ.. చేసిన అభివృద్ధి శాశ్వతం: చంద్రబాబు
ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ, తాను చేసిన అభివృద్ధి శాశ్వతమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
హైదరాబాద్: ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ, తాను చేసిన అభివృద్ధి శాశ్వతమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 25ఏళ్ల క్రితం విజన్ 2020 ప్రకటించినప్పుడు కొందరు విజన్ 420 అని అవహేళన చేశారన్నారు. కానీ, ప్రస్తుతం తన విజన్ హైదరాబాద్ అభివృద్ధిలో కనిపిస్తోందని తెలిపారు. ఇప్పుడు విజన్ 2047 గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. 2047కు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతుందన్నారు.
టెలికమ్యూనికేషన్ల విషయంలోనూ ఎన్నో సంస్కరణలు తెచ్చామని, వాటి ఫలితాలు ఇప్పుడు అంతా అనుభవిస్తున్నారని తెలిపారు. భవిష్యత్లో భారత్కు సాటి వచ్చే దేశాలు లేవన్నారు. 75ఏళ్ల క్రితం వరకు బ్రిటిషర్లు ఇండియాను పాలించారు.. కానీ, ఇప్పుడు ఓ ఇండియన్ బ్రిటన్ను పాలిస్తున్నారని తెలిపారు. దేశంలో మధ్య తరగతి ప్రజల సంఖ్య బాగా పెరుగుతోందన్నారు.
‘‘1978లో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మాకు జీపు ఇచ్చేవారు. అప్పటి రోడ్లలో జీపులు నడిపేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇప్పుడు మీరు న్యూ ఇండియా చూస్తున్నారు. దేశ ప్రగతిని సంస్కరణలకు ముందు.. తర్వాత అని చెప్పుకోవాలి. 2047కు మన తలసరి ఆదాయం 26వేల డాలర్లుగా ఉండాలి. ప్రస్తుతం మనది ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మరో పాతికేళ్లలో మనది ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థ అవుతుంది. 2047నాటికి ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావాలి. యువత తలచుకుంటే 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావడం సాధ్యమే. విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు చాలా మంది హెచ్చరించారు. విద్యుత్ సంస్కరణల కారణంగా నేను అధికారం కూడా కోల్పోయాను. దేశంలో విద్యుత్ సంస్కరణల రూపకల్పనలో నాది కీలకపాత్ర. దేశంలోనే మొదటి హరిత విమానాశ్రయం శంషాబాద్లో నిర్మించాం. శంషాబాద్ విమానాశ్రయం కోసం 20 ఎయిర్పోర్టులను స్వయంగా పరిశీలించా. ఐటీ, బీటీ, ఫార్మా వంటి రంగాల్లో ఎంతో ప్రగతి సాధించాం’’ అని చంద్రబాబు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..