Chandrababu: సి.నరసింహారావు కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు

ఇటీవల మృతిచెందిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస పుస్తక రచయిత, రాజకీయ విశ్లేషకులు సి.నరసింహారావు కుటుంబాన్ని తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు.

Updated : 15 May 2022 16:22 IST

హైదరాబాద్‌: ఇటీవల మృతిచెందిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస పుస్తక రచయిత, రాజకీయ విశ్లేషకులు సి.నరసింహారావు కుటుంబాన్ని తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్‌లో నరసింహారావు నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం నరసింహారావు భార్య జ్యోతి, కుమారుడు హర్షకు చంద్రబాబు ధైర్యం చెప్పారు.

అనారోగ్యంతో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రిలో నరసింహారావు కొంతకాలంగా చికిత్స పొందారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. వెంటనే వైద్యులు అత్యవసర చికిత్సకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గుండె వైఫల్యంతో బుధవారం అర్ధరాత్రి తర్వాత 1.50 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని