
Eye care: కంట్లో రసాయనాలు పడితే ఏం చేయాలో తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: మహిళలు ఇంట్లో వంట చేసేటప్పుడు కారం, ఇల్లు శుభ్రం చేసినప్పుడు దుమ్ము, బ్లీచింగ్.. పురుషులు సిమెంట్, సున్నం పని చేసినప్పుడు కంట్లో పడేందుకు అవకాశాలు చాలా ఉంటాయి. కొన్నిసార్లు విద్యార్థులు ప్రయోగాలు చేసినప్పుడు రసాయనాలు కంట్లో పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలు చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ముందుగానే జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ప్రమాదం జరిగితే నీటితో కడగాలే తప్ప సొంత వైద్యం పనిచేయదని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదాలతో కంటికి ఇబ్బందులు కలగకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో కంటి వైద్యులు రవికుమార్రెడ్డి పలు సూచనలు చేశారు.
ఈ కష్టం వద్దు సుమా: సున్నం, సిమెంటు, కారం, పసుపు, రసాయనాలు ఏవైనా కంట్లో పడితే చూపు దెబ్బతీస్తాయి. ఆ చూపును తిరిగి తెప్పించడం చాలా కష్టం. కాల్షియం హైడ్రాక్సైడ్ ఉండే సున్నం చాలా ప్రమాదకరం. కంట్లో పడితే తినేస్తుంది. యాసిడ్ పడినా అక్కడ ముద్దలాగా మారుతుంది. కంట్లో ఏం పడిందో స్పష్టంగా చెప్పినపుడే వైద్యం చేయడం కాస్త సులువుగా ఉంటుంది.
నీటితో కడిగితే బాగు : కంట్లో ఏదైనా పడితే దాని అవశేషాలు పోయేదాకా ఆసుపత్రిలో నీటితో శుభ్రం చేస్తారు. ఆ తర్వాత చికిత్స అందిస్తారు. రసాయనాలు పడినపుడు వెంటనే శుభ్రం చేస్తే సమస్య తొలగిపోదు. ఒక్కో చుక్క నీటిని కంటిలో రెండు, మూడు గంటలు పడేలా చేస్తాం. అప్పుడే దాని తీవ్రత తగ్గుతుంది. తర్వాత స్టిరాయిడల్ డ్రాప్స్ రెండు వారాలు వాడాలి. అవసరమైతే శస్త్రచికిత్స చేయకతప్పదు.
జాగ్రత్తలు తప్పనిసరి: సున్నం, సిమెంటు పని చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కంట్లో పడకుండా కళ్లాద్దాలు, హెల్మెట్గానీ పెట్టుకోవాలి. బాత్, వాష్రూముల్లో యాసిడ్స్ చిన్నారులకు దూరంగా ఉంచాలి. రైతులు క్రిమిసంహారక మందులను చల్లే సమయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. చేతి తొడుగులు, కళ్లాద్దాలు వాడాలి. పరిశ్రమల్లో పని చేసే ప్రదేశంలో హెచ్చరిక సూచికలు పెట్టాలి. కార్మికులకు తగిన రక్షణ చర్యలు తీసుకుంటే కళ్లను కాపాడుకోవడానికి వీలుంటుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
Android 12: ఆండ్రాయిడ్ 12 యూజర్లకు గూగుల్ మరో కొత్త యాప్
-
General News
Cesarean Care: శస్త్రచికిత్స తర్వాత ఏం జరుగుతుందంటే...!
-
Technology News
Xiaomi 12S Ultra: సోని సెన్సర్తో షావోమి ఫోన్ కెమెరా.. ఇక మొబైల్తోనే వీడియో షూట్!
-
General News
HMDA: హెచ్ఎండీఏ ఈ-వేలానికి ఆదరణ.. తుర్కయాంజిల్లో గజం రూ.62,500
-
General News
Health: మత్తు వ్యసనాలను వదిలించుకోండి ఇలా..!
-
Movies News
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
- Eknath Shindhe: నాడు ఆటో నడిపారు.. ఇకపై మహారాష్ట్రను నడిపిస్తారు..
- Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే
- YSRCP: గన్నవరం వైకాపాలో 3 ముక్కలాట.. అభ్యర్థి ఎవరో తేల్చేసిన కొడాలి నాని
- Income Tax Rules: రేపటి నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..
- iPhone 12: యాపిల్ ఐఫోన్ 12పై ఆఫర్..₹ 20 వేల వరకు తగ్గింపు!
- Revanthreddy: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కలిసేందుకు సిద్ధంగా లేము: రేవంత్రెడ్డి
- Eknath Shinde: మహారాష్ట్ర సీఎంగా శిందే, డిప్యూటీ సీఎంగా ఫడణవీస్ ప్రమాణ స్వీకారం
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?