విశాఖ ఫార్మాసిటీలో రసాయనాల లీకేజ్‍

విశాఖ పరవాడలోని జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఒక కంపెనీ నుంచి రసాయనాలు వెలువడ్డాయంటూ కార్మికులు పరుగులు తీశారు.

Published : 26 Aug 2021 15:37 IST

విశాఖపట్నం: విశాఖ పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఒక కంపెనీ నుంచి రసాయనాలు వెలువడ్డాయంటూ కార్మికులు పరుగులు తీశారు. వాయువులు పీల్చలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమీపంలోని తాడి గ్రామస్థులు కూడా కర్మాగారం ఎదుట ఆందోళన చేశారు. గతంలోనూ తమకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయంటూ మండిపడ్డారు. కర్మాగారం యాజమాన్యం నిబంధనలు పాటించడంలేదంటూ ఆరోపించారు. వారిపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్‌లో తమ ప్రాణాలకు ఎలాంటి ముప్పూ లేదని.. తమకు భరోసా ఇవ్వాలని యాజమాన్యాన్ని స్థానికులు డిమాండ్ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని