Andhra News: శ్రీశైలం దేవస్థానం ప్రధాన అర్చకుడు వీరభద్రయ్య కన్నుమూత

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న జె.వీరభద్రయ్య బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Published : 08 Dec 2022 01:48 IST

శ్రీశైలం ఆలయం: శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న జె.వీరభద్రయ్య బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బుధవారం రాత్రి మృతదేహాన్ని శ్రీశైలానికి తీసుకు వస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. వీరభద్రయ్య మార్చి 25న ధర్మకర్తల మండలి ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. రెండేళ్ల క్రితమే ఆయన ఆలయ ప్రధాన అర్చకులుగా బాధ్యతలు స్వీకరించారు. వీరభద్రయ్య మృతిపట్ల శ్రీశైలం దేవస్థానం ఉద్యోగులు, సిబ్బంది సంతాపం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు