‘ప్లాస్మా.. కరోనా బాధితుల పాలిట సంజీవని’
కరోనా వేళ ఫ్రంట్లైన్ వారియర్లుగా సేవలందిస్తున్న పోలీసులకు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు ఎనలేని సేవలందిస్తున్నారని కొనియాడారు. కరోనా నుంచి కోలుకొని ప్లాస్మా దానం చేసిన వారికి సీపీ
సినీ నటుడు చిరంజీవి
ప్లాస్మా దాతలకు సత్కార కార్యక్రమం
హైదరాబాద్: కరోనా వేళ ఫ్రంట్లైన్ వారియర్లుగా సేవలందిస్తున్న పోలీసులకు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు ఎనలేని సేవలందిస్తున్నారని కొనియాడారు. కరోనా నుంచి కోలుకొని ప్లాస్మా దానం చేసిన వారిని సీపీ సజ్జనార్ సత్కరించారు. గచ్చిబౌలిలో జరిగిన ఈ సత్కార కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ‘‘కరోనా బారిన పడి ఎంతో మంది బాధితులుగా మారుతున్నారు. కరోనాకు మందు లేని పరిస్థితుల్లో అయోమయం నెలకొంది. ప్లాస్మా అనేది బాధితుల పాలిట సంజీవనిగా నిలుస్తోంది. కరోనా బాధితులకు ప్లాస్మా ఇస్తే 99 శాతం బతికే అవకాశముంది. ప్లాస్మాలో ఉండే యాంటీబాడీల వల్ల కరోనా నుంచి కోలుకుంటారు. ఒకరి ప్లాస్మా నుంచి 30 మందికి సాయం చేయొచ్చు. కమిషనర్ సజ్జనార్ మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో లాక్డౌన్ సమయంలో చాలా మందికి సాయం చేశారు. గతంలో నేను బ్లడ్ బ్యాంక్ను కూడా ఇలానే ప్రారంభించాను. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉత్తమ బ్లడ్ బ్యాంక్గా ఎంపికైంది. మా బంధువు వైరస్ సోకి అపోలోలో చికిత్స పొందుతూ ఉంటే స్వామి నాయుడు అనే వ్యక్తి ప్లాస్మా ఇవ్వడం ద్వారా నయమైంది’’అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
ప్లాస్మా దానం వల్ల రక్తం నష్టం అనేది ఉండదని.. ప్లాస్మా తగ్గినా 24 గంటల నుంచి 48 గంటల్లో తిరిగి తయారవుతుందని చిరంజీవి తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారు ధైర్యంగా ప్లాస్మా దానం చేయాలని కోరారు. ప్లాస్మా దానం చేసిన వారికి మళ్లీ కరోనా సోకినా లేదా వారి కుటుంబసభ్యులకు కరోనా వచ్చినా వారికి ప్లాస్మా చికిత్సలో ప్రాధాన్యత ఇస్తామని సజ్జనార్ చెప్పారన్నారు. తన అభిమానులను ఇలాంటి మంచి పనుల వైపు మళ్లించగలిగితే సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. అందరూ జాగ్రత్తగా ఉంటే వందశాతం కరోనాను ఎదుర్కొవచ్చని చిరంజీవి అన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. తలసేమియా రోగుల కోసం సైబరాబాద్ పోలీసులు మొదలుపెట్టిన బ్లడ్ డోనేషన్ కార్యక్రమానికి చిరంజీవి గారు ఎంతో సహాయపడ్డారని చెప్పారు. కరోనా విజేతలు ఎలాంటి అపోహలు లేకుండా, ధైర్యంగా ప్లాస్మా దానం చేయాలని కోరారు. ప్లాస్మా దానం కూడా రక్త దానం లాంటిదేన్నారు. ప్లాస్మా యోధులు.. ప్రాణ దాతలు కరోనా సోకిన వారిని అవమానించొద్దని విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపండి: ఏపీ సీఎస్ ఆదేశం
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 29 తేదీ వరకు నాగర్జున సాగర్ నుంచి నీటి విడుదల కొనసాగుతుందని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ - బెంగళూరు మధ్య 20 వేసవి ప్రత్యేక రైళ్లు.. శని, ఆదివారాల్లోనే..!
బెంగళూరు- విశాఖల మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. -
బాబాయినే హతమార్చిన వారు.. మీరు వేలు కోసుకుంటే స్పందిస్తారా?: లోకేశ్
వైకాపా అరాచకాలు, అవినీతిపై దిల్లీలో పోరాడుతున్న ఉద్యమకారిణి కోవూరు లక్ష్మిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్లను తెదేపా అధినేత చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రొద్దుటూరులో టిడ్కో ఇళ్ల పునాదుల కూల్చివేత.. అడ్డుకున్న తెదేపా
వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో టిడ్కో ఇళ్ల పునాదులను వైకాపా ప్రభుత్వం కూల్చివేసింది. ఈ విషయం తెలుసుకున్న తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి కూల్చివేతను అడ్డుకున్నారు. -
తెలంగాణ ప్రజలకు చల్లని కబురు.. మూడు రోజుల పాటు వర్షాలు
తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. -
ఎంపీ అభ్యర్థి మాధవీలతతో ఏఎస్సై ఆలింగనం.. సస్పెండ్ చేసిన సీపీ
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన సైదాబాద్ ఏఎస్సై ఉమాదేవి సస్పెండ్ అయ్యారు. -
కవితకు బెయిల్ ఇవ్వొద్దు: సీబీఐ
దిల్లీ మద్యం విధానం సీబీఐ కేసులో రౌస్ అవెన్యూ న్యాయస్థానంలో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. -
కోనసీమ జిల్లాలో బోరు నుంచి మంటలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బోరు నుంచి మంటలు వచ్చాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ టెన్త్ ఫలితాలు.. రీవాల్యుయేషన్, సప్లిమెంటరీ పరీక్షల వివరాల కోసం క్లిక్ చేయండి
ఏపీ పదో తరగతి ఫలితాల్లో (AP SSC Results) 86.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. -
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు (AP SSC Results 2024) విడుదలయ్యాయి. -
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు
భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు. -
తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం
తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ముడాపై మురిసిన తోడేళ్లు..!
మట్టి, ఇసుక, బుసక పేరిట వైకాపా శ్రేణులు దోపిడీకి పాల్పడుతున్నా ఎలాంటి చర్యలు ఉండవు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పోర్టు అవసరాల కోసం తెదేపా ప్రభుత్వం రైతుల భూములను కొనుగోలు చేస్తే... -
‘నమాజు సమయంలో మమ్మల్ని గుర్తుపెట్టుకోండి’
ఎన్నికల్లో మతపరమైన అంశాలతో ప్రచారం చేయకూడదనే కఠిన నిబంధనలున్నా.. వైకాపా నేతలకు మాత్రం వర్తించడం లేదు. విచ్చలవిడిగా మతపరమైన అంశాలను జోడించి ప్రచారం చేస్తున్నారు. -
కమిటీల పేరుతో కాలయాపన
ప్రతి అయిదేళ్లకు ఒక సారి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించడం ఆనవాయితీ. ఒకవేళ ఇది ఆలస్యమైతే ఐఆర్ (మధ్యంతర భృతి) ప్రకటిస్తుంది. -
జగనన్న.. గూడు పుఠాణి
అన్నింట్లో అధినేతనే అనుసరించే కొందరు ప్రజాప్రతినిధులు జగనన్న కాలనీలకు భూసేకరణలోనూ చేతివాటం ప్రదర్శించారు. పేదలు నివాసం ఉండే ఇళ్లకు లోతట్టు ప్రాంతాల్లో భూములు సేకరించారు. వాటి మెరక పేరిట మట్టి మెక్కేసి వదిలేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
-
రాష్ట్రంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపండి: ఏపీ సీఎస్ ఆదేశం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
విశాఖ - బెంగళూరు మధ్య 20 వేసవి ప్రత్యేక రైళ్లు.. శని, ఆదివారాల్లోనే..!
-
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్