Chiranjeevi: డోకిపర్రు వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న చిరంజీవి దంపతులు

కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామివారిని మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు దర్శించుకున్నారు. మెగా ఇంజినీరింగ్‌ సంస్థ ఆహ్వానం మేరకు... ఆలయం వద్దకు చేరుకున్న చిరంజీవి దంపతులకు

Updated : 15 Jan 2022 06:10 IST

గుడ్లవల్లేరు: కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామివారిని మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు దర్శించుకున్నారు. మెగా ఇంజినీరింగ్‌ సంస్థ ఆహ్వానం మేరకు... ఆలయం వద్దకు చేరుకున్న చిరంజీవి దంపతులకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవస్థానం ప్రాంగణంలోని ఆంజనేయస్వామిని దర్శించుకుని గోదాదేవి కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. మెగా ఇంజినీరింగ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లు పీపీ రెడ్డి, కృష్ణారెడ్డి, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని