AP Voter List: ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ఉపాధ్యాయులకే అప్పగించండి: సీఎఫ్డీ
ఏపీ ఓటరు జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది.
అమరావతి: ఏపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి (సీఈవో) సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ (సీఎఫ్డీ) ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఎఫ్డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సీఈవోకు వినతిపత్రం సమర్పించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అధ్యాపకులకు ఇవ్వాలని కోరారు. ఈ ప్రక్రియను గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది చేపట్టారని సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బందికి అనుభవలేమి, బూత్ లెవెల్ అధికారుల అనుభవ రాహిత్యంతో జాబితాలో తప్పులు దొర్లుతున్నాయని స్పష్టం చేశారు. వారి తప్పిదాలతో ఓటర్లు ‘రైట్ టు ఓట్’ అంశాన్ని కోల్పోతున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు.
ఓటర్ల జాబితాలో అక్రమాలు, భారీగా ఓట్ల తొలగింపు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎఫ్డీ పేర్కొంది. ఒకే డోర్ నెంబర్పై వందలాది ఓట్ల నమోదు జరిగినట్లు తెలిసిందని తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై ఇటీవల కాగ్ నుంచి కూడా అభ్యంతరాలు వచ్చినట్లు సీఈవో దృష్టికి తీసుకెళ్లింది. ఓటర్ల జాబితాలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది జోక్యాన్ని తప్పించాలని కోరింది. ఓటర్ల జాబితా ప్రక్షాళన కాకుండా ఎన్నికలు పారదర్శకంగా జరిగే అవకాశమే లేదని సీఎఫ్డీ పేర్కొంది. గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లపై రాజకీయ నేపథ్య ఆరోపణలు ఉన్నాయని, ఈ క్రమంలో వారిని ఎన్నికల ప్రక్రియ నుంచి దూరంగా ఉంచాలని కోరింది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఉపాధ్యాయులకు అపార అనుభవం ఉందన్న సీఎఫ్డీ.. అనుభవం గల టీచర్లకు ఎన్నికల ప్రక్రియను అప్పగించాలని కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
holidays list: ఏపీలో వచ్చే ఏడాది 20 సాధారణ సెలవులు
ఏపీలో వచ్చే ఏడాది(2024)లో సాధారణ సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
Srinagar NIT: శ్రీనగర్ ఎన్ఐటీలో ఆందోళన.. ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు
జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్ ఎన్ఐటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ చదువుతున్న తెలుగు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
Supreme court: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
ఫైబర్ నెట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. -
AP HighCourt: ఎస్సై నియామక ప్రక్రియపై హైకోర్టులో విచారణ
ఏపీలో ఎస్సై నియామక ప్రక్రియలో సింగిల్ జడ్జి ధర్మాసనం ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. -
EastCoast Train: ఈస్ట్కోస్టు ఎక్స్ప్రెస్లో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద ఈస్ట్కోస్టు ఎక్స్ప్రెస్లో పొగలు వచ్చాయి. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Nagarjuna sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏపీ పోలీసులు అర్ధరాత్రి నాగార్జున సాగర్ వద్దకు చేరుకొని ఎస్పీఎఫ్ పోలీసులపై దాడి చేశారు. డ్యామ్పై విద్యుత్ సరఫరా నిలిపివేసి, అక్కడి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. -
హైదరాబాద్ ఓటర్ల కోసం ‘పోల్ క్యూ రూట్’ పోర్టల్
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ కొత్త పోర్టల్ను ఓటర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/11/23)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
Jerusalem: జెరూసలెంలో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి..!
-
holidays list: ఏపీలో వచ్చే ఏడాది 20 సాధారణ సెలవులు
-
Indian Navy: భారత నౌకాదళం చేతికి మూడు అత్యాధునిక నౌకలు..!
-
Stock market: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
-
Ranbir Kapoor: ఒకప్పుడు ఫ్లోర్ తుడిచి.. ఇప్పుడు స్టార్గా నిలిచి.. రణ్బీర్ ప్రయాణమిదీ
-
Narayana Murthy: ఆ రంగంలో మూడు షిఫ్టులు ఉండాలి: ఇన్ఫీ నారాయణమూర్తి