Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దర్శనానికి వచ్చిన

Updated : 06 Mar 2022 10:37 IST

తిరుమల: తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. తొలుత ఆలయ మహాద్వారం వద్ద తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఆలయ ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి సీజేఐకు స్వాగతం పలికారు. 

శ్రీవారి దర్శనం అనంతరం జస్టిస్‌ ఎన్వీ రమణ మీడియాతో మాట్లాడారు. తిరుమలలో శుభ్రత, సుందరీకరణ చాలా బాగున్నాయని చెప్పారు. రెండేళ్ల తర్వాత రోజూ వేలాదిమంది సామాన్య భక్తులకు సర్వదర్శనం కల్పించడం సంతోషకరమన్నారు. భవిష్యత్‌లో కొవిడ్‌లాంటి వ్యాధులు రాకుండా ప్రపంచాన్ని కాపాడాలని శ్రీవారిని ఆయన ప్రార్థించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు