అమర జవాను కుటుంబానికి రూ.50 లక్షల సాయం
గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ సైనికుడు జశ్వంత్రెడ్డి(23) వీరమరణం పొందడంపై సీఎం
కడప: గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ సైనికుడు జశ్వంత్రెడ్డి(23) వీరమరణం పొందడంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. జశ్వంత్రెడ్డి త్యాగం మరువలేనిదని అన్నారు. జమ్ముకశ్మీర్లోని సుందర్బాని సెక్టార్లో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో జశ్వంత్రెడ్డి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.కడప జిల్లా పర్యటనలో ఉన్న జగన్ అక్కడి నుంచే ప్రభుత్వ సాయాన్ని ప్రకటించారు.
కడప జిల్లాలో వరుసగా రెండో రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు ఎప్పుడూ నిండుకుండలా ఉండాలని ఆకాంక్షించారు. కుందూ నదిపై లిఫ్ట్ ద్వారా బ్రహ్మం సాగర్కు నీళ్లు తరలిస్తామన్నారు. బద్వేలులో సుమారు రూ.500కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. బద్వేలు నియోజవకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానన్నారు. నియోజకవర్గ రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు. కడప-పోరుమామిళ్ల రహదారిలో 4 వరుసల రహదారికి సీఎం శంకుస్థాపన చేశారు. బ్రహ్మణపల్లి సమీపంలో సగిలేరుపై మరోవంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బద్వేలులో నూతన ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!