CM Jagan: కిదాంబి శ్రీకాంత్‌, షేక్‌ జాఫ్రిన్‌లను సన్మానించిన సీఎం జగన్‌

భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌, ఇండియన్‌ డెఫిలింపియన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ను ఏపీ సీఎం జగన్‌ అభినందించారు. సచివాలయంలో సీఎంను శ్రీకాంత్‌, షేక్‌ జాఫ్రిన్‌

Updated : 24 Jun 2022 15:55 IST

అమరావతి: భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌, ఇండియన్‌ డెఫిలింపియన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ను ఏపీ సీఎం జగన్‌ అభినందించారు. సచివాలయంలో సీఎంను శ్రీకాంత్‌, షేక్‌ జాఫ్రిన్‌ కలిశారు. ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక థామస్‌ కప్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌, బధిరుల ఒలింపిక్‌ క్రీడలు (డెఫిలింపిక్స్‌-2022)లో కర్నూలుకు చెందిన జాఫ్రిన్‌ కాంస్య పతకం సాధించడంపై సీఎం ప్రశంసించారు.

అంతర్జాతీయ వేదికలపై ఏపీ ప్రతిష్ఠ చాటడంపై జగన్‌ అభినందించారు. షేక్‌ జాఫ్రిన్‌కు అర్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగం, నగదు ప్రోత్సాహం ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వం తరఫున వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలని సీఎంవో అధికారులకు సూచించారు. అనంతరం శ్రీకాంత్‌, జాఫ్రిన్‌ను సీఎం జగన్‌ సన్మానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని