Andhra News: జగన్‌ కర్నూలు పర్యటన.. దివ్యాంగురాలి గృహనిర్బంధం

సీఎం జగన్‌ కర్నూలు పర్యటన సందర్భంగా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. నగరానికి చెందిన దివ్యాంగురాలు సుభద్రబాయిని గృహనిర్బంధం చేశారు.

Updated : 16 Apr 2022 10:59 IST

కర్నూలు: సీఎం జగన్‌ కర్నూలు పర్యటన సందర్భంగా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. నగరానికి చెందిన దివ్యాంగురాలు సుభద్రబాయిని గృహనిర్బంధం చేశారు. గత పర్యటన సందర్భంగా ఉద్యోగం ఇవ్వాలని దివ్యాంగురాలు సీఎంను కోరింది. స్పందించిన జగన్‌ సుభద్రబాయికి ఉద్యోగం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.  తనకు ఇప్పటి వరకు ఉద్యోగం ఇవ్వలేదని.. జగన్‌ను మళ్లీ కలుస్తానేమోనని శుక్రవారం ఉదయం నుంచి గృహనిర్బంధంలోనే ఉంచినట్లు సుభద్రబాయి తెలిపారు. తనకు ఇప్పటికైనా ఉద్యోగం ఇవ్వాలని కోరారు. పత్తికొండ ఎమ్మెల్యే బంధువుల వివాహ వేడుకలో పాల్గోనేందుకు జగన్ ఇవాళ కర్నూలులో పర్యటించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని