CM Jagan: ‘గోరుముద్ద’ మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అడుగులు: సీఎం జగన్
పాఠశాల విద్యార్థులు పౌష్టికాహార లోపంతో బాధపడకూడదని.. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రాగి జావ అందిస్తోందని ఏపీ సీఎం జగన్ అన్నారు.
అమరావతి: పాఠశాల విద్యార్థులు పౌష్టికాహార లోపంతో బాధపడకూడదని.. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రాగి జావ అందిస్తోందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ‘జగనన్న గోరుముద్ద’ పథకంలో భాగంగా రాగి జావ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిల్లలకు సదుపాయాలు కల్పించడం సహా మేథో వికాసం పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రాగిజావ సరఫరా ద్వారా వారికి పోషకాహార లోపం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. వారంలో మూడు రోజుల పాటు దీన్ని అందిస్తామన్నారు. ‘గోరుముద్ద’ పథకాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నామని చెప్పారు. రాగిజావ పంపిణీ కోసం ఏటా రూ.86 కోట్లు ఖర్చు అవుతుందని.. వీటిలో సత్యసాయి ట్రస్ట్ రూ.42కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.44 కోట్లు భరిస్తున్నాయని జగన్ వివరించారు. పథకంలో భాగస్వాములవుతున్నందుకు సత్యసాయి ట్రస్ట్ను సీఎం అభినందించారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులతో జగన్ మాట్లాడారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Shashi Tharoor: ‘ప్రస్తుత విలువలకు చిహ్నంగా అంగీకరించాలి’.. సెంగోల్పై కాంగ్రెస్ ఎంపీ ట్వీట్
-
Movies News
Hanuman: ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’పై ఉండదు: ప్రశాంత్ వర్మ
-
Politics News
Nara Lokesh: పోరాటం పసుపు సైన్యం బ్లడ్లో ఉంది: లోకేశ్
-
Sports News
IPL Final: అహ్మదాబాద్లో వర్షం.. మ్యాచ్ నిర్వహణపై రూల్స్ ఏం చెబుతున్నాయి?
-
India News
Manipur: మణిపుర్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 40 మంది తిరుగుబాటుదారుల హతం
-
Sports News
Ambati Rayudu: ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు