CM Jagan: భారత ఉత్పత్తులు పోటీపడాలంటే రవాణా వ్యయం తగ్గాలి: సీఎం జగన్
ప్రపంచస్థాయిలో భారత ఉత్పత్తులు పోటీ పడాలంటే రవాణా వ్యయం గణనీయంగా తగ్గాల్సిన అవసరముందని సీఎం జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
దిల్లీ: భారత్లో లాజిస్టిక్ రంగం చేస్తున్న వ్యయం ఎక్కువగా ఉందని, ప్రపంచ స్థాయిలో భారత ఉత్పత్తులు పోటీ పడేందుకు ఇది ప్రతిబంధకం అవుతోందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఈ వ్యయం గణనీయంగా తగ్గాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశానికి సీఎం హాజరయ్యారు. రాష్ట్రం సాధించిన ప్రగతి- అమలు చేస్తున్న కార్యక్రమాలపై సమావేశంలో నివేదిక సమర్పించారు. అన్ని రాష్ట్రాలు జట్టుగా పనిచేయాల్సిన అవసరముందన్నారు.
ప్రపంచస్థాయిలో భారత ఉత్పత్తులు పోటీ పడాలంటే రవాణా వ్యయం గణనీయంగా తగ్గాల్సిన అవసరముందని సీఎం జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో సరకు రవాణా కారిడార్లు, జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం చేస్తున్న వ్యయం ప్రశంసనీయమన్నారు. ఏపీ కూడా పోర్టు ఆధారిత అభివృద్ధిపై దృష్టి పెట్టిందని.. ఇందులో భాగంగా కొత్తగా నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తోందన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసినట్టు తెలిపారు. జీడీపీ పెరుగుదలలో సేవలు, తయారీ రంగాలే కీలకమని వ్యాఖ్యానించారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ద్వారా రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తద్వారా 6లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రజారోగ్యం, పౌష్టికాహారంపై దృష్టి పెట్టామన్నారు. వైద్య రంగంలో కీలకమైన సంస్కరణలు తెచ్చామని సీఎం వెల్లడించారు. ఏపీలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ విధానాల్ని అనుసరిస్తున్నట్టు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన