CM Jagan: విద్యార్థులకు పాము కాటు ఘటన.. ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం జగన్‌

విజయనగరం జిల్లా కురుపాం గురుకులంలో విద్యార్థులకు పాము కాటు ఘటనపై సీఎం జగన్‌ స్పందించారు. మృతిచెందిన విద్యార్థి రంజిత్‌ కుటుంబానికి రూ.5లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.

Published : 05 Mar 2022 10:16 IST

కురుపాం: విజయనగరం జిల్లా కురుపాం గురుకులంలో విద్యార్థులకు పాము కాటు ఘటనపై సీఎం జగన్‌ స్పందించారు. మృతిచెందిన విద్యార్థి రంజిత్‌ కుటుంబానికి రూ.5లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. మంత్రుల ద్వారా ఇవాళ ఆర్థికసాయం అందిస్తామని కలెక్టర్‌ సూర్యకుమారి తెలిపారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు ప్రభుత్వ ఖర్చుతోనే వైద్యం చేయిస్తామన్నారు. విద్యార్థికి పాము కాటు ఘటనపై సీఎంకు మంత్రులు పుష్ప శ్రీవాణి, వేణుగోపాల్‌ వివరించారు. ఒకరు మృతి, మరో ఇద్దరు విద్యార్థులు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. దీంతో వెంటనే స్పందించిన సీఎం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని