CM Jagan: ఏపీని నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి: జగన్ ఆదేశం
ఏపీలో అక్రమ మద్యం, గంజాయి సాగుకు వ్యతిరేకంగా అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎస్ఈబీ, ఆబ్కారీశాఖపై ఇవాళ ఆయన సమీక్ష నిర్వహించారు.
అమరావతి: ఏపీని నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగం ఉండకూడదన్నారు. ఎస్ఈబీ, ఆబ్కారీ శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం పోలీసు, ఆబ్కారీ శాఖ కలిసి పని చేయాలని అధికారులకు సూచించారు. నార్కొటిక్స్కు వ్యతిరేకంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో భారీ హోర్డింగ్స్ పెట్టాలన్నారు. ఎస్ఈబీ టోల్ఫ్రీ నెంబర్ను బాగా ప్రచారం చేయాలని కోరారు. అక్రమ మద్యాన్ని అరికట్టాలని, గంజాయి సాగు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దిశ చట్టం, యాప్ ఇంకా సమర్థంగా అమలు కావాల్సిన ఆవశ్యకతను సీఎం గుర్తుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.