CM Jagan: ఈ ఏడాది వసూళ్లు భేష్‌.. సీఎం జగన్‌కు వివరించిన అధికారులు

రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఆదాయాల ప్రగతి ఆశాజనకంగా ఉందని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. 94.47శాతం లక్ష్యం చేరుకున్నట్టు వెల్లడించారు.

Published : 06 Oct 2022 16:08 IST

అమరావతి: రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఆదాయాల ప్రగతి ఆశాజనకంగా ఉందని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. 94.47శాతం లక్ష్యం చేరుకున్నట్టు వెల్లడించారు. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో అధికంగా జీఎస్టీ వసూళ్లు ఉన్నాయన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆదాయ ఆర్జన శాఖలపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. పారదర్శక, సులభతర విధానాల ద్వారా  చెల్లింపుదారులకు సౌలభ్యంగా ఉండాలన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీని సీఎం ఏర్పాటు చేశారు. నాటు సారా తయారీయే వృత్తిగా ఉన్న వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించాలని అధికారులను ఆదేశించారు. అనుమతులు పొందిన లీజుదారులు మైనింగ్‌ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వారికేమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రవాణాశాఖలో ఆదాయాల పెంపుపై చర్యలు తీసుకోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని