CM Jagan: అప్పుడు గౌతమ్రెడ్డి ఒత్తిడే పనిచేసింది: సంస్మరణ సభలో సీఎం జగన్
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి కుటుంబానికి తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
నెల్లూరు: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి కుటుంబానికి తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గౌతమ్ లేని లోటును భర్తీ చేయలేమని.. కానీ ఆయన అందరి మనస్సుల్లో అగ్రస్థానంలో నిలిచిపోయాడని చెప్పారు. నెల్లూరు గ్రామీణ మండలం కనుపర్తిపాడులోని వీపీఆర్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన గౌతమ్రెడ్డి సంస్మరణ కార్యక్రమంలో జగన్ మాట్లాడారు. గౌతమ్రెడ్డి కుటుంబానికి దేవుడు తోడుగా ఉండాలని.. వారికి అన్ని రకాలుగా మంచి జరగాలని ఆకాంక్షించారు. గౌతమ్లాంటి మంచి వ్యక్తిని కోల్పోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామని.. నమ్మడానికి ఇంకా కష్టంగానే ఉందని చెప్పారు.
నా ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్నాడు..
‘‘నేను లేకపోయుంటే గౌతమ్ బహుశా రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదేమో. అప్పట్లో కాంగ్రెస్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీతో ఒక యుద్ధం ప్రారంభమైంది. ఆ సమయంలో కాంగ్రెస్ ఎంపీగా ఉన్న మేకపాటి రాజమోహన్రెడ్డి నాకు అండగా నిలబడేందుకు గౌతమ్తో ఉన్న సాన్నిహిత్యమే కారణం. రాజమోహన్రెడ్డి నా వైపు ఉండేందుకు గౌతమ్ ఒత్తిడే పనిచేసింది. 2009 నుంచి సాగిన ఆ ప్రయాణంలో ప్రతి అడుగులోనూ స్నేహితుడిగా అతడు నాకు తోడున్నాడు. గౌతమ్రెడ్డి నాకంటే ఒక సంవత్సరం పెద్దోడు.. అయినా ఏ రోజూ అలా ఉండేది కాదు. నన్నే అన్నగా భావించేవాడు. మేమంతా ఉన్నాం.. నువ్వు చేయగలవు అని ప్రోత్సహించేవాడు. ఆ తర్వాత నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. మంచి నాయకుడిగా ఎదిగాడు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంచి మంత్రిగా కొనసాగాడు.
సంగం బ్యారేజ్కు గౌతమ్ పేరు పెడతాం
పరిశ్రమలు తీసుకొస్తే మన రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని గౌతమ్ తాపత్రయ పడేవాడు. దుబాయ్ సదస్సుకు వెళ్లే ముందు కూడా నన్ను కలిశాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నన్ను కలిసి అక్కడ విషయాలు వివరించేందుకు సమయం కూడా అడిగాడు. ఈలోపే ఇలా జరిగిపోయింది. రాజమోహన్రెడ్డి సూచన మేరకు కళాశాలను అగ్రికల్చర్ కాలేజ్గా, అవకాశముంటే యూనివర్సిటీగా మారుస్తాం. గౌతమ్ చిరకాల వాంఛ అయిన వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలకు నీరందిస్తాం. మే 15లోపు సంగం బ్యారేజ్ పనులు పూర్తిచేస్తాం. ఆ బ్యారేజీకి ‘మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజ్’గా నామకరణం చేసి దాన్ని ప్రారంభిస్తాం’’ అని జగన్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?